Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భర్తతో గొడవపడి ప్రియుడితో వచ్చేసిన వివాహిత, గంజాయి బిజినెస్ పెట్టి....

భర్తతో గొడవపడి ప్రియుడితో వచ్చేసిన వివాహిత, గంజాయి బిజినెస్ పెట్టి....
, శనివారం, 19 ఫిబ్రవరి 2022 (14:37 IST)
పెళ్ళయ్యింది. ముగ్గురు పిల్లలున్నారు. భర్త ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. సాఫీగా సాగిపోతున్న కుటుంబం. అయితే ఆమె పక్కదారి పట్టింది. ప్రియుడినే సర్వస్వంగా భావించింది. కుటుంబాన్ని వదిలి వెళ్ళిపోయింది. ప్రియుడితో సహజీవనం పెట్టింది. ప్రియుడు గంజాయి అమ్ముతూ రెండు చేతులా డబ్బులు సంపాదించడంతో ఆమె కూడా ఆ ఊబిలోకి దిగింది. తన అందంతో వ్యాపారాన్ని మరింత  రెట్టింపు చేసింది.

 
క్రిష్ణా జిల్లా ఉయ్యూరుకు చెందిన మహిళకు ముగ్గురు పిల్లలున్నారు. భర్తతో గొడవపడి ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. సాదిక్ అనే యువకుడితో సన్నిహిత సంబంధం పెట్టుకుంది. మొదట్లో ఫైనాన్స్ వ్యాపారం చేస్తూ ఉండే సాదిక్ ఆ తరువాత గంజాయిని అమ్మడం మొదలెట్టాడు. 

 
గంజాయిని అమ్మడంతోనే డబ్బులు బాగా కూడబెట్టాడు. తన ప్రియురాలిని అన్ని హంగులతో ఉన్న ఇంటికి తీసుకెళ్ళాడు. సకల సౌకర్యాలు కల్పించాడు. దీంతో ఆ వివాహిత కూడా ఇందుకు సహకరించడం ప్రారంభించింది.

 
యువకులకు గంజాయి ఇచ్చేది. ఇలా వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయల్లా సాగింది. వ్యాపారంలో తమకు తిరుగులేదని భావించింది. ప్రియుడు కూడా గంజాయి వ్యాపారంలో ఆరితేరి పోవడంతో డబ్బులే డబ్బులు. అయితే పోలీసులకు అడ్డంగా దొరికాడు ప్రియుడు. దీంతో కటాకటాల పాలయ్యాడు. పోలీసులు సాదిక్‌ను అరెస్టు చేస్తే తన ప్రియురాలు గురించి కూడా చెప్పేశాడు. దీంతో వివాహితను కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేంద్ర బడ్జెట్.. రాష్ట్రంపై సవతితల్లి ప్రేమ..