టెర్రరిస్ట్ చెంప ఛెళ్లుమనిపించిన భక్తుడు.. వీడియో వైరల్... ట్విస్ట్ ఏంటంటే...

Webdunia
బుధవారం, 9 ఆగస్టు 2023 (12:38 IST)
ఆలయానికి వచ్చిన ఓ భక్తుడు సాయుధ తీవ్రవాది చెంప పగులగొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే, తాను కొట్టిన వ్యక్తి తీవ్రవాది కాదని తెలుసుకుని ఆ భక్తుడు అవాక్కయ్యాడు. ఈ సంఘటన మహారాష్ట్రలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
మహారాష్ట్రలోని స్వామి నారాయణ ఆలయంలో ఉన్నఫళంగా ఓ తీవ్రవాది ప్రవేశించాడు. దీంతో అప్పటివరకు ప్రశాతంంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా భయానకరంగా మారిపోయింది. స్వామి దర్శనానికి వచ్చిన భక్తులు ప్రాణభయంతో వణికిపోయారు. ఇదంతా చూసిన ఓ భక్తుడికి మాత్రం చిర్రెత్తుకొచ్చింది. టెర్రరిస్ట్ చేతిలో తుపాకీ ఉన్నప్పటికీ ఏమాత్రం వెనుకంజ వేయకుండా వెళ్లి నేరుగా చెంప ఛెళ్లుమనిపించాడు. దీంతో సదరు తీవ్రవాది ఖంగుతిన్నాడు. 
 
చివరుకు ఇదంతా పోలీసులు నిర్వహించిన మాక్ డ్రిల్ అని తేలడంతో భక్తులంతా ఊపిరి పీల్చుకుని, సాటి భక్తుడు చేసిన పనికి పగలబడి నవ్వుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ సంఘటన సిటీలోని ప్రసిద్ధి స్వామి నారాయణ్ ఆలయంలో జరిగింది. టెర్రర్ దాడుల సమయంలో ప్రజలు ఎలా స్పందిస్తారనే విషయం తెలుసుకోవడంతో పాటు అవగాహన కల్పించేందుకు పోలీసులు ఈ మాక్ డ్రిల్ నిర్వహించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దక్షిణాదిలో జియో హాట్‌స్టార్ రూ.4 వేల కోట్ల భారీ పెట్టుబడి

Peddi: పెద్ది కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభం, మార్చి 27న రిలీజ్

Rana: టైం టెంపరరీ సినిమా అనేది ఫరెవర్ : రానా దగ్గుబాటి

గుర్రం పాపిరెడ్డి బోర్ కొట్టదు, అవతార్ రిలీజ్ మాకు పోటీ కాదు : డైరెక్టర్ మురళీ మనోహర్

మనల్ని విమర్శించే వారి తిట్ల నుంచే పాజిటివ్ ఎనర్జీని తీసుకుందాం. ఎదుగుదాం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రిపూట ఇవి తింటున్నారా? ఐతే తెలుసుకోవాల్సిందే

సీజనల్ ఫ్రూట్ రేగు పండ్లు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఫ్యాషన్‌ను ప్రముఖమైనదిగా నడిపించే బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

అధునాతన క్యాన్సర్ చికిత్సకై టాటా మెమోరియల్ ఎసిటిఆర్ఇసితో కోటక్ మహీంద్రా భాగస్వామ్యం

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

తర్వాతి కథనం
Show comments