వార్డులో చికిత్స పొందుతున్న రోగి.. చనిపోయాడంటూ మృతదేహం అప్పగింత

అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చేరిన రోగి వార్డులో చికిత్స పొందుతుంటే... రోగి చనిపోయాడంటూ వేరొకరి మృతదేహాన్ని అప్పగించిన ఘటన ముంబై నగరంలో చోటుచేసుకుంది. ముంబై మహానగరంలో సంచలనం రేపిన ఈ ఘటన వివరాలను పరిశీ

Webdunia
గురువారం, 21 జూన్ 2018 (20:23 IST)
అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చేరిన రోగి వార్డులో చికిత్స పొందుతుంటే... రోగి చనిపోయాడంటూ వేరొకరి మృతదేహాన్ని అప్పగించిన ఘటన ముంబై నగరంలో చోటుచేసుకుంది. ముంబై మహానగరంలో సంచలనం రేపిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే...
 
ముంబై నగరంలోని తాషేగామ్ ప్రాంతానికి చెందిన అవినాష్ దాదాసాహెబ్ భగ్వాడే (50) కాలేయ సమస్యతో బాధపడుతుండటంతో అతని కుటుంబ సభ్యులు సాంగ్లీలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భగ్వాడే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకుంటుండగా ఆసుపత్రి వైద్యులు అతను మరణించాడని చెప్పి మరో వ్యక్తి మృతదేహాన్ని భగ్వాడే కుటుంబసభ్యులకు అప్పగించారు. 
 
మృతదేహానికి పోస్టుమార్టం చేయించి గుడ్డ కట్టి ఉంచడంతో భగ్వాడే కుటుంబసభ్యులు మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చారు. కొందరు బంధువులు భగ్వాడే మృతదేహం కాదని చెప్పడంతో అతని కుటుంబసభ్యులు గుడ్డ తీసి చూడగా గుర్తుతెలియని వ్యక్తి మృతదేహమని వెల్లడైంది. 
 
దీంతో భగ్వాడే కుటుంబసభ్యులు గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని తీసుకొని ఆసుపత్రికి వెళ్లగా అక్కడ భగ్వాడే చికిత్సపొందుతూ కోలుకుంటూ కనిపించాడు. బతికున్న రోగి మరణించాడంటూ మరొకరి మృతదేహాన్ని అప్పగించిన ఆసుపత్రి వైద్యుల నిర్వాకంపై భగ్వాడే కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ వ్యవహారంపై దర్యాప్తుచేసి, కారకులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సుభోద్ ఉగానే చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Gopal Varma: రాంగోపాల్ వర్మ.. షో మ్యాన్..మ్యాడ్ మాన్స్టర్

Shivaj :ఓవర్సీస్ ప్రీమియర్లతో సిద్ధం చేస్తున్న ధండోరా

Dhanush: కృతి స‌న‌న్ తో ప్రేమలో మోసపోయాక యుద్ధమే అంటున్న ధనుష్ - అమ‌ర‌కావ్యం (తేరే ఇష్క్ మై)

అఖండ 2 డిసెంబర్ 12న వస్తోందా నిర్మాతలు ఏమన్నారంటే?

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments