Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేపే ‘మహా’ బలపరీక్ష.. సుప్రీం ఆదేశాలు.. ఓపెన్ బ్యాలెట్ విధానం ద్వారా?

Webdunia
మంగళవారం, 26 నవంబరు 2019 (13:27 IST)
‘మహా’ రాజకీయంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. బలపరీక్ష కోసం వారం రోజులు ఆగాల్సిన అవసరంలేదని చెప్పింది. రేపు అనగా నవంబర్ 27న మహారాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని సుప్రీం ఆదేశించింది. రేపు సాయంత్రం 5 గంటలలోగా ఓపెన్ బ్యాలెట్ విధానం ద్వారా విశ్వాస పరీక్ష నిర్వహించాలని చెప్పింది. ఆ కార్యక్రమాన్ని అంతా వీడియో తీయాలని కూడా ఆదేశించింది. 
 
అందుకోసం సభ్యులందరూ కలిసి ప్రొటెం స్పీకర్ ఎన్నుకోవాలని చెప్పింది. ప్రొటెం స్పీకర్ పర్యవేక్షణలోనే బల పరీక్ష జరపాలని స్పష్టం చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో అన్నీ పార్టీలు రాజ్యాంగం యొక్క విలువను కాపాడాలని ధర్మాసనం పేర్కొంది. జస్టిస్ ఎన్. వి. రమణ, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ సంజీవ్ ఖన్నాలతో కూడిన ధర్మాసనం తన తీర్పును వెలువరించింది.
 
బలపరీక్ష నేపథ్యంలో.. కూటమి తమకు 162 మంది ఎమ్మెల్యేల మద్ధతు ఉన్నట్లు ప్రకటించింది. 
 
అంతేకాకుండా 162 మంది ఎమ్మెల్యేలతో సమావేశమై ఒక బల ప్రదర్శనను కూడా నిర్వహించాయి. కాగా.. బీజేపీ కూడా తమకు 170 మంది ఎమ్మెల్యేల మద్ధతు ఉందని ప్రకటించింది. దీంతో రేపటి బలపరీక్షలో ఎవరు నెగ్గుతారో.. ఎవరు ఓడుతారో తెలియాలంటే కాస్త ఓపిక పట్టాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments