Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అజిత్ సినిమా టిక్కెట్ దొరకలేదనీ అభిమాని ఆత్మహత్యాయత్నం

అజిత్ సినిమా టిక్కెట్ దొరకలేదనీ అభిమాని ఆత్మహత్యాయత్నం
, శుక్రవారం, 9 ఆగస్టు 2019 (11:18 IST)
తమిళ హీరో అజిత్ నటించిన తాజా చిత్రం 'నెక్కొండ పార్వై'. బాలీవుడ్‌లో సూపర్ హిట్ అయిన పింక్ చిత్రానికి రీమేక్. అజిత్ ప్రధాన పాత్రలో నటించాడు. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న అజిత్ కొత్త చిత్రం వస్తుందంటే అభిమానులకు ఓ పండగే. 
 
అలాగే, నెక్కొండ పార్వై చిత్రానికి కూడా ఎంతో క్రేజ్ లభించింది. ఈ చిత్ర తొలిరోజు టికెట్ తనకు దక్కలేదన్న మనస్తాపంతో ఓ వీరాభిమాని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. 
 
రాష్ట్ర రాజధాని చెన్నై మహానగరం, రాయపేటలోని సత్యం సినీ మల్టీప్లెక్స్ వద్ద ఈ ఘటన జరుగగా, ఆ సమయంలో అక్కడే ఉన్ననటుడు శంతను భాగ్యరాజ్, తన ట్విట్టర్ ఖాతాలో ఈ విషయాన్ని వెల్లడించాడు. 
 
రాత్రి, 11.55 గంటల సమయంలో ఈ ఘటన జరిగిందని చెప్పాడు. టికెట్ దొరకలేదన్న కారణంగా పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేశాడని అన్నారు. అక్కడే ఉన్న పోలీసులు, అతన్ని అరెస్టు చేసి తరలించారని, అభిమానులు ఈ తరహా చర్యలకు పాల్పడవద్దని శంతను పిలుపునిచ్చాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'శర్వానంద్ 'రణరంగం' సెన్సార్ పూర్తి. ఇంత‌కీ... సెన్సార్ రిపోర్ట్ ఏంటి..?