ప్రాణవాయువే ప్రాణం తీసింది.. ఆక్సిజన్ లీక్ కావడంతో 11మంది మృతి

Webdunia
బుధవారం, 21 ఏప్రియల్ 2021 (14:42 IST)
దేశంలో కరోనా విజృంభిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్ర కరోనాకు హాట్ స్పాట్‌గా మారింది. రోజు రోజుకీ కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతోంది. కరోనా రోగులకు తగిన సౌకర్యాలు అందట్లేదు. బెడ్లు సరిపోవట్లేదు. ఇటీవల ముంబైలో కరోనా రోగులున్న ఆస్పత్రుల్లో అగ్నిప్రమాదాలు చోటుచేసుకున్నాయి. తాజాగా మహారాష్ట్రలో ఘోరం జరిగింది. ప్రాణ వాయువే ప్రాణాలు తీసింది. 
 
నాసిక్‌లోని డాక్టర్ జాకిర్ హుస్సేన్ ఆస్పత్రిలో ఆక్సీజన్ ట్యాంకర్ లీకైంది. ఈ క్రమంలో రోగులకు ఆక్సీజన్ సరఫరా నిలిచిపోయి ఐసీయూలోని 11 మంది రోగులు మరణించారు. మహారాష్ట్రలోని కరోనా ఆస్పత్రుల్లో ఆక్సీజన్ కొరత నేపథ్యంలో పెద్ద ఎత్తున ఆక్సీజన్ ట్యాంకర్లను పంపిస్తున్నారు. ఈ క్రమంలోనే నాసిక్‌లోని జాకీర్ ఆస్పత్రికి కూడా ట్రక్కుల ద్వారా ఆక్సీజన్ తరలించారు. వాటిని ఆస్పత్రిలోని ట్యాంకర్‌లో నింపుతుండగా ఒక్కసారిగా ఆక్సీజన్ లీకయింది. 
 
పెద్ద మొత్తంలో లీకవడంతో దట్టమై పొగలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. జాకీర్ హుస్సేన్ ఆస్పత్రిలోని 171 మంది రోగులు ఆక్సీజన్‌పై చికిత్స పొందుతున్నారు. ఐతే ట్యాంకర్ లీక్ కావడంతో ఆక్సీజన్ సరఫరా నిలిచిపోయింది. దాంతో ప్రాణ వాయువు అందక 11 మంది మరణించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kantara Chapter 1: రెబెల్ స్టార్ ప్రభాస్ లాంచ్ చేసిన రిషబ్ శెట్టి కాంతార: చాప్టర్ 1 ట్రైలర్ (video)

Mardaani 3: నవరాత్రి ఆరంభం సందర్భంగా రాణి ముఖర్జీ మర్దానీ 3 పోస్టర్ విడుదల

అనకొండ తిరిగి వచ్చేసింది: పాల్ రుడ్, జాక్ బ్లాక్‌లతో నవ్వులు, యాక్షన్, థ్రిల్స్ పక్కా

ఓజీ చిత్రానికి సహకరించిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కృతజ్ఞతలు: డిప్యూటీ సీఎం పవన్

వేట‌కు సిద్ధ‌మైన‌ బెంగాల్ టైగ‌ర్, OG ట్రైల‌ర్‌పై హీరో సాయి దుర్గ తేజ్‌రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Navratri Snacks: నవరాత్రి స్నాక్స్.. సగ్గుబియ్యం టిక్కా.. అరటి పండ్ల చిప్స్ సింపుల్‌గా..

కామెర్ల వ్యాధితో రోబో శంకర్ కన్నుమూత, ఈ వ్యాధికి కారణాలు, లక్షణాలేమిటి?

రీస్టార్ట్ విత్ ఇన్పోసిస్.. మహిళా ఉద్యోగులకు శుభవార్త.. ఏంటది?

యాలకలు 6 ప్రయోజనాలు, ఏంటవి?

పండుగ కలెక్షన్ మియారాను విడుదల చేసిన తనైరా

తర్వాతి కథనం
Show comments