Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మహారాష్ట్ర జైలులో ఖైదీలకు కరోనా.. ఇంద్రాణి ముఖర్జి ఆ జైలులోనే..?

మహారాష్ట్ర జైలులో ఖైదీలకు కరోనా.. ఇంద్రాణి ముఖర్జి ఆ జైలులోనే..?
, బుధవారం, 21 ఏప్రియల్ 2021 (12:00 IST)
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కరోనా సెకండ్‌ వేవ్‌తో కేసుల సంఖ్య పెరుగుతోంది. దేశంలో మూడు లక్షలకు చేరువలో రోజువారీ కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24గంటల్లో 2,95,041 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. ఇక గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా కరోనాతో 2,023 మంది బాధితులు మృతి చెందారు.
 
అలాగే కరోనాకు మహారాష్ట్ర హాట్ స్పాట్‌గా మారింది. మహారాష్ట్రలో కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది. గత రెండు వారాలుగా రోజూ 50 వేలకు తగ్గకుండా కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. బయటి జనాలనేగాక ఇప్పుడు జైల్లో ఖైదీలను కూడా కరోనా గడగడలాడిస్తుంది. 
 
ముంబైలోని బైకులా జైల్లో ఇవాళ 38 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్ వచ్చింది. షీనా బోరా హత్యకేసులో దోషిగా తేలిన ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జి కూడా ప్రస్తుతం ఆ జైల్లోనే శిక్ష అనుభవిస్తుంది. కరోనా పాజిటివ్ వచ్చిన 38 మంది ఖైదీల్లో ఇంద్రాణి కూడా ఉన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్‌కు ఆరోగ్యం ఎలావుంది?