Webdunia - Bharat's app for daily news and videos

Install App

వంతెనపై నుంచి కిందపడిన కారు - ఏడుగురు వైద్య విద్యార్థులు మృతి

Webdunia
మంగళవారం, 25 జనవరి 2022 (10:07 IST)
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వంతెన నుంచి ఓ కారు అదుపుతప్పి కిందపడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు వైద్య విద్యార్థులు మృత్యువాతపడ్డారు. రోడ్డు డివైడర్‌ను డీకొట్టడంతో కారు అదుపుతప్పి వంతెన పై నుంచి కిందపడింది. దీంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదం మహారాష్ట్రలోని వార్ధా జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, సావంగిలోని దత్తా మేగే వైద్య కాలేజీలో చదువుతున్న ఏడుగురు వైద్య విద్యార్థులు యావత్ మాల్ నుంచి వార్ధాకు కారులో బయలుదేరారు. గత రాత్రి అర్థరాత్రి దాటిన తర్వాత 1.30 గంటల సమయంలో ఈ కారు ప్రమాదం జరిగింది. సెల్సురా వద్ద కారుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో అది అదుపుతప్పి వంతెన పై నుంచి కిందపడి నుజ్జునుజ్జు అయింది. 
 
దీంతో విద్యార్థులంతా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో అటుగా వెళుతున్న లారీ ఒకటి ఈ ప్రమాద వార్తను స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను వెలికి తీయగా, వీరిలో ఒకరు తిరోడా బీజేపీ ఎమ్మెల్యే విజయ రహంగ్‌డేల్‌ ఏకైక కుమారుడు కూడా ఉన్నట్టు గుర్తించారు. ఈ ప్రమాదంపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments