Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‍‌కు కరోనా పాజిటివ్: ప్రధాని ఆరా

Advertiesment
compensation
, సోమవారం, 24 జనవరి 2022 (20:40 IST)
మహారాష్ట్ర కేంద్రంగా పనిచేసే జాతీయ పార్టీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.  
 
తాను కరోనాకు గురైనట్టు స్వయంగా వెల్లడించిన శరద్ పవార్.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. 
 
ఈ మధ్యకాలంలో తనను కలిసినవారు పరీక్ష చేయించుకోవాలని, జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు అంతేకాదు, ప్రధాని నరేంద్ర మోదీ సైతం తన ఆరోగ్యం గురించి ఆరా తీసినట్లు తెలిపారు. 
 
"ప్రధాని మోదీ ఫోన్ చేసి నా ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు. ఆయన చూపిన శ్రద్ధకు నేను కృతజ్ఞుడిని"అని పవార్ తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేసీఆర్‌కు కిషన్ రెడ్డి లేఖ.. టీఆర్ఎస్ ఆరోపణల్లో నిజం లేదు