19 మంది విద్యార్థులకు కరోనా +ve: ఒమిక్రాన్‌తో భయం భయం

Webdunia
శనివారం, 25 డిశెంబరు 2021 (15:40 IST)
ఉత్తరాదిన ఒమిక్రాన్ వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. కరోనా మూడో వేవ్‌తో తప్పదని ఇప్పటికే శాస్త్రవేత్తలు హెచ్చరించిన తరుణంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రజలకు చుక్కలు చూపిస్తోంది. చిన్నా పెద్దా తేడా లేకుండా ఒమిక్రాన్ కాటేస్తోంది. తాజాగా మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌లోని ఒక పాఠశాలలో 19 మంది పిల్లలకు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ ప్రకటించారు. 
 
జవహర్ నవోదయ విద్యాలయ అనుబంధ పాఠశాలలో కరోనా వ్యాప్తి కలకలం రేపుతోంది. జిల్లాలోని టాక్లీ ధోకేశ్వర్ గ్రామంలోని రెసిడెన్షియల్ సీబీఎస్‌ఈ అనుబంధ పాఠశాల అయిన జవహర్ నవోదయ విద్యాలయంలో చదువుతున్న 450 మంది విద్యార్థుల నమూనాలను పరీక్ష కోసం పంపారు. అందులో 19 మంది పాజిటివ్‌గా వచ్చారు. మొత్తం 450 నమూనాల విశ్లేషణ ఇంకా కొనసాగుతోందని జిల్లా కలెక్టర్ రాజేంద్ర భోసలే తెలిపారు.
 
మరోవైపు దేశంలో కొత్త‌గా 7,189 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య శాఖ ప్ర‌క‌టించింది. అలాగే, శుక్రవారం క‌రోనా నుంచి 7,286 మంది కోలుకోగా, 387 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ప్ర‌స్తుతం 77,032 క్రియాశీల కేసులు ఉన్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు క‌రోనా నుంచి 3,42,23,263 మంది కోలుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజువల్‌గా మీకు అద్భుతమైన అనుభవం ఉంటుంది... రచ్చ రవి

ఫోటోను ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకుని మోసాలు చేస్తున్నారు.. తస్మాత్ జాగ్రత్త : అదితి రావు హైదరీ

SS Rajamouli, దేవుడి మీద నమ్మకం లేదన్న రాజమౌళి సగటు మనిషే కదా... అందుకే...

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments