Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియురాలి ఖర్చుల కోసం కిడ్నాప్‌ డ్రామా.. తల్లిదండ్రులకే టోకరా!

Webdunia
గురువారం, 11 నవంబరు 2021 (12:51 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భీండ్‌ జిల్లా గోహద్‌ ప్రాంతానికి చెందిన సందీప్ అనే యువకుడు తన ప్రియురాలి ఖర్చుల కోసం ఏకంగా కిడ్నాప్ డ్రామాకు తెరదీశాడు. తనను తానే కిడ్నాప్ చేసుకున్నాడు. ఆ తర్వాత తల్లిదండ్రులకు ఫోన్ చేసి రూ.2.50 లక్షలు ఇస్తేనే మీ పిల్లోడిని వదిలివేస్తామని కిడ్నాపర్లు మాట్లాడినట్టుగా గొంతుమార్చి మాట్లాడాడు. చివరకు పోలీసులకు చిక్కడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
 
సందీప్ అనే యువకుడు తమ ప్రాంతానికే చెందిన ఓ యువతిని గాఢంగా ప్రేమించాడు. ఆమె కోసం ఖర్చు చేసేందుకు డబ్బులు లేకపోవడంతో తానే కిడ్నాప్‌కు గురైనట్లు నాటకం ఆడాడు. కిడ్నాపర్‌లా గొంతమార్చి మాట్లాడుతూ తల్లిదండ్రులను నమ్మించాడు. కుమారుడిని విడిచిపెట్టాలంటే రూ.2.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. 
 
దీంతో ఈనెల 6న వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. సందీపే కిడ్నాపర్‌ అని వెల్లడైంది. అతని మొబైల్‌ నెట్‌వర్క్‌ లొకేషన్‌ ఆధారంగా పోలీసులు గ్వాలియర్‌లో సందీప్‌ ఆచూకీని గుర్తించి అరెస్టు చేశారు. కిడ్నాప్‌ డ్రామాపై యువకుడిని ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments