Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలుడిని మింగేసిందన్న అనుమానంతో మొసలికి చిత్రహింసలు

Webdunia
గురువారం, 14 జులై 2022 (09:10 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ మొసలిని గ్రామస్థులు చిత్రహింసలకు గురిచేశారు. బాలుడిని మింగేసిందన్న అనుమానంతో గ్రామస్థులు ఈ పనికి పాల్పడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని ష్యోపుర్‌ జిల్లా రిఝెంటా గ్రామానికి చెందిన పదేళ్ల బాలుడు అతర్‌ సింగ్‌ సోమవారం చంబల్‌ నదిలో స్నానానికి వెళ్లాడు. కాసేపటి తర్వాత కనిపించకుండా పోయాడు. బాలుడిని మొసలి మింగేసిందని గ్రామస్థులంతా అనుకున్నారు. ఓ వల తెచ్చి దాన్ని పట్టుకున్నారు. ఒడ్డుకు లాక్కొచ్చి తాళ్లతో కట్టేశారు. 
 
బాలుడికి ఆక్సిజన్‌ అందడం కోసమని మొసలి నోరు తెరిచి ఉంచేలా పెద్ద కర్ర పెట్టారు. చివరకు పొట్ట చీల్చి, బాలుడిని బయటకు లాగడానికి ప్రయత్నిస్తూ చిత్రహింసలు పెట్టారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, అటవీ శాఖ అధికారులు.. గ్రామస్థులకు నచ్చజెప్పి.. మొసలిని తిరిగి నదిలో విడిచిపెట్టారు. బాలుడి కోసం గాలించగా.. మంగళవారం నదిలో శవమై కనిపించాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments