Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎల్‌టీసీ ఉద్యోగులకు శుభవార్త.. ఓచర్ పథకం సిద్ధం

Webdunia
బుధవారం, 11 నవంబరు 2020 (17:46 IST)
ప్రభుత్వ ఉద్యోగులకు పండగ బొనాంజా కింద ఎల్‌టీసీ నగదు ఓచర్‌ పథకాన్ని తీసుకొచ్చిన కేంద్రం తాజాగా మరో శుభవార్త చెప్పింది. ఈ పథకం కింద ఉద్యోగులు మాత్రమే కాకుండా వారి కుటుంబసభ్యులు కూడా కొనుగోళ్లు చేసుకోవచ్చని వెల్లడించింది. ఈ మేరకు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎక్స్‌పెండిచర్‌ ఎఫ్‌ఏక్యూలో పేర్కొంది. అంతేగాక, ఎల్‌టీసీ పథకం వినియోగించకుండా అక్టోబరు 12 తర్వాత కొనుగోలు చేసిన వస్తువులకు కూడా రియంబర్స్‌మెంట్‌ పొందవచ్చని స్పష్టం చేసింది.
 
అక్టోబరు 12న ఈ ఎల్‌టీసీ (లీవ్‌ ట్రావెల్‌ కన్సెషన్‌) నగదు ఓచర్‌ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ పథకం కింద కొనుగోలు చేసే వస్తువుల బిల్లులపై ఉద్యోగుల పేరే ఉండాలా లేదా కుటుంబ సభ్యులు కూడా ఉండొచ్చా అని మంత్రిత్వశాఖను అడగ్గా.. ఉద్యోగి భాగస్వామి లేదా కుటుంబసభ్యుల పేర్ల మీద కూడా కొనుగోళ్లు చేసుకోవచ్చని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎక్స్‌పెండిచర్‌ తెలిపింది.
 
అయితే ఆ కుటుంబసభ్యుల పేర్లు తప్పకుండా ఉద్యోగి సర్వీస్‌ రికార్డుల్లో ఉండాలని సూచించింది. అంతేగాక, ఈఎంఐ రూపంలో కొనుగోలు చేసే వాటికి కూడా ఈ పథకం వర్తిస్తుందని పేర్కొంది. అక్టోబరు 12 నుంచి వచ్చే ఏడాది మార్చి-31లోపు ఎల్‌టీసీని ఉపయోగించకుండా వస్తువులు కొనుగోలు చేసినా.. వాటిపై రియంబర్స్‌మెంట్‌ పొందొచ్చని తెలిపింది.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments