Webdunia - Bharat's app for daily news and videos

Install App

జల్సా కోసం ఓ ప్రేమ జంట చోరీల బాట.. ఓనర్స్‌ను ఏమార్చి..?

Webdunia
శనివారం, 9 అక్టోబరు 2021 (17:32 IST)
జల్సా కోసం ఓ ప్రేమ జంట చోరీల బాట పట్టింది. ఇల్లు అద్దెకు కావాలంటూ వచ్చి.. ఓనర్స్‌ను ఏమార్చి.. ఆ ఇంట్లోని విలువైన వస్తువులు దొంగిలించేవారు.  కర్ణాటక బెంగళూరులో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ జంట దొంగతనాన్ని పోలీసులు ఛేదించారు. అద్దెకు ఇల్లు కావాలని వస్తూ చోరీలు చేసే ప్రేమజంటను వినయ్, కీర్తనగా గుర్తించారు పోలీసులు. వీరిద్దరికీ 3 సంవత్సరాల క్రితం పరిచయమైంది. 
 
వినయ్​పై ఓ హత్య కేసుతో పాటు.. పలు క్రిమినల్ కేసుల్లో నిందితుడని.. ఇప్పటికే రౌడీషీట్ ఉందని పోలీసులు తెలిపారు. అయితే వినయ్ రౌడీషీటర్ అని తెలిసినప్పటికీ.. అతడిని లవ్ చేస్తున్నట్లు పోలీసులకు వెల్లడించింది కీర్తన. ఈ క్రమంలోనే అక్టోబర్ 4న మారుతీనగర్‌లోని ఓ ఇంటికి వెళ్లిన ఈ క్రైమ్ కపుల్.. ప్రైవేట్ కంపెనీ ఎంప్లాయిస్‌గా పరిచయం చేసుకొని ఇల్లు అద్దెకు కావాలని నాటకం ఆడారు. 
 
అనంతరం ఓనర్ దృష్టిని మరల్చి ఒక మొబైల్​ఫోన్, ల్యాప్​టాప్, రూ.15 వేల నగదును దొంగిలించారు. తమ ఇంట్లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి ఓనర్ ఇంటి అద్దెకోసం వచ్చిన జంట దొంగతనానికి పాల్పడినట్లు గుర్తించి.. చంద్ర లేఅవుట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ప్రేమజంటను అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీఎం పెళ్లాం సమాజానికి మంచి చేయాలనుకుంటే ఏమైంది ?

రెండు మతాల మధ్య చిచ్చు పెట్టిన గొర్రె కథతో గొర్రె పురాణం ట్రైలర్

ఫ్యామిలీ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని చంద్రహాస్ తో రామ్ నగర్ బన్నీ తీసా : ప్రభాకర్

దుబాయ్‌లో సుబ్రహ్మణ్య- బియాండ్ ఇమాజినేషన్ చిత్రం గ్లింప్స్ రిలీజ్

కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన మేఘా ఆకాశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం

బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఎక్స్‌క్లూజివ్ ఐవేర్ కలెక్షన్‌

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

తర్వాతి కథనం
Show comments