Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అత్యాచారం చేయబోతే ప్రతిఘటన.. అంతే సజీవదహనం..

అత్యాచారం చేయబోతే ప్రతిఘటన.. అంతే సజీవదహనం..
, మంగళవారం, 5 అక్టోబరు 2021 (20:13 IST)
మహిళలపై అకృత్యాలు చోటుచేసుకుంటూనే వున్నాయి. తాజాగా లైంగిక దాడిని ప్రతిఘటించిన మహిళను సజీవదహనం చేసాడు ఓ కామాంధుడు. ఈ ఘటన కర్ణాటకలో దారుణం జరిగింది.

వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాష్ట్రంలోని యాద్గిర్ జిల్లా, సర్పూర్ తాలూకాకు చెందిన గంగప్ప బసప్ప అనే వ్యక్తి సోమవారం తెల్లవారుజామున ఓ వివాహిత ఇంట్లోకి చొరబడి ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు. దీంతో ఆమె ప్రతిఘటించింది. ఇదే సమయంలో తన వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను సదరు మహిళపై పోసి నిప్పటించాడు దుండగుడు. 
 
దీంతో మహిళ కేకలు వేసింది.. ఆమె కేకలు విన్న స్థానికులు ఘటన స్థలికి వచ్చి మంటలు ఆర్పీ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె శరీరం 95 శాతం కాలిపోయినట్లు వైద్యులు తెలిపారు. చికిత్స పొందుతూ మహిళ మృతి చెందింది. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదుపై నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నీట్‌-పీజీ 2021: పాత సిలబస్‌నే పునరుద్ధరించాలి.. సుప్రీం కోర్టు