Webdunia - Bharat's app for daily news and videos

Install App

జైలు సిబ్బందికి లంచాలు..శశికళకు అరెస్ట్ వారెంట్

Webdunia
బుధవారం, 6 సెప్టెంబరు 2023 (08:36 IST)
అక్రమాస్తుల కేసులో బెంగుళూరులోని పరప్పణ అగ్రహార జైలులో అన్నాడీఎంకే మాజీ నేత శశికళ, ఆమె బంధువు ఇళవరసిలు జైలు శిక్షను అనుభవించారు. ఆ సమయంలో వారిద్దరూ మెరుగైన సౌకర్యాల కల్పన కోసం జైలు అధికారులకు రెండు కోట్ల మేరకు లంచాలు ఇచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై కోర్టులో విచారణ సాగుతోంది. ఈ కేసు విచారణకు వారిద్దరూ హాజరుకాకుండా డుమ్మా కొడుతున్నారు. దీంతో వారిద్దరినీ అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచాలంటూ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అలాగే, ఈ కేసు విచారణను వచ్చే నెల ఐదో తేదీకి వాయిదా వేసింది.
 
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ప్రియ నెచ్చెలి శశికళకు కర్నాటక లోకాయుక్త కోర్టు ఈ అరెస్టు వారెంట్ జారీచేసింది. అక్రమాస్తుల కేసులో దోషిగా తేలి బెంగుళూరులోని పరప్పణ అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న సమయంలో తమ గదిలో మెరుగైన సౌకర్యాల కల్పన కోసం జైలు అధికారులకు లంచమిచ్చినట్టు శశికళ, ఇళవరసిలు అభియోగాలు ఎదుర్కొంటున్నారు. 
 
జైలు అధికారులకు రూ.2 కోట్ల మేరకు లంచం ఇచ్చినట్టు ఆమెపై కేసు నమోదైంది. మంగళవారం బెంగుళూరులోని లోకాయుక్త కోర్టులో జరిగిన విచారణకు శశికళ, ఆమె మరదలు (బంధువు) ఇళవరసి తరపు న్యాయవాదులు కూడా హాజరుకాలేదు. దీంతో న్యాయమూర్తి వారిద్దరికీ అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. వారికి బెయిల్ పూచీకత్తు ఇచ్చిన వారికి కూడా నోటీసులు జారీ చేసిన కోర్టు తదుపరి విచారణను అక్టోబరు ఐదో తేదీకి వాయిదా వేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

Virgin: ఫోన్ల వర్షం - కానుకల వర్షంతో ప్రేక్షకులకు ఆఫర్ ఇస్తున్న వర్జిన్ బాయ్స్ టీమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments