'జై భీమ్.. అల్లాహ్ అక్బర్.. జై హింద్’... హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ప్రమాణం

Webdunia
మంగళవారం, 18 జూన్ 2019 (20:47 IST)
లోక్ సభలో మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీగా ప్రమాణం చేస్తున్న సమయంలో ఓ ఆసక్తికర పరిణామం జరిగింది. ఆయన ఎంపీగా ప్రమాణం చేసేందుకు పోడియం వద్దకు రాగానే కొందరు భాజపా ఎంపీలు ‘జై శ్రీరామ్’, ‘భారత్ మాతాకీ జై’ అంటూ నినాదాలు చేయడం మొదలుపెట్టారు. ప్రమాణం చేసేందుకు ముందుకు వచ్చిన అసదుద్దీన్ కూడా... అరవండి... అరవండి అంటూ చేతులతో సైగలు చేశారు. ఇది 17వ లోక్‌సభ సమావేశాల రెండో రోజైన మంగళవారం నాడు చోటుచేసుకుంది.
 
ఐతే అసదుద్దీన్ ప్రమాణం చేస్తూ... స్పీకర్ పోడియం ముందుకు వెళ్లి, వాళ్లను ఆపండి నేను ప్రమాణం చేస్తానని ప్రొటెం స్పీకర్‌కి విన్నవించారు. దీనితో హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి సహచర ఎంపీలను వారించడంతో వారు కాస్త నినాదాల హోరు తగ్గించారు. దానితో ఆయన తన ప్రమాణాన్ని పూర్తి చేశారు. ఐతే చివర్లో అసదుద్దీన్... ‘జై భీమ్.. అల్లాహ్ అక్బర్.. జై హింద్’ అంటూ పూర్తి చేశారు. ఇపుడా వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. మీరూ ఓ లుక్కేయండి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

Nag Aswin: కొత్తవారితో సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్‌ సినిమా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments