Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాక్‌డౌన్ ఎఫెక్టు :: ఊరిలో మొగుడు .. ఇంట్లో ప్రియుడు.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 4 మే 2020 (18:23 IST)
కరోనా వైరస్ మహమ్మారిని కట్టడి చేసేందుకు కేంద్రం దశలవారీగా లాక్‌డౌన్‌ను అమలు చేస్తోంది. అయితే, ఈ లాక్‌డౌన్ సమయంలో ఇంతకాలం గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతూ వచ్చిన వివాహేతర సంబంధాలు బట్టబయలవుతున్నాయి. 
 
తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ యువ వ్యాపారి తన స్నేహితుడుతో కట్టుకున్న భార్య రహస్యంగా కొనసాగిస్తూ వచ్చిన అక్రమ సంబంధం గుట్టును రట్టు చేశాడు. ఇంతకీ ఈ వ్యాపారికి ఇటీవలే వివాహం కావడం గమనార్హం. దీనికి సంబంధించిన వివరాలను పరిశీలిస్తే, 
 
పంకజ్ అనే యువ వ్యాపారికి రింకీ అనే మహిళతో ఇటీవలే వివాహమైంది. తన వ్యాపార కార్యకలాపాల్లో భాగంగా పంకజ్ పలు రాష్ట్రాలకు వెళ్లి వచ్చేవాడు. ఈ క్రమంలో పంకజ్ చండీగఢ్‌లో ఉన్న సమయంలో దేశం లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయింది. దీంతో పంకజ్ అక్కడే చిక్కుకునిపోయాడు. 
 
ఈ పరిస్థితుల్లో ఒంటరిగా ఉన్న తన భార్యకు చేదోడువాదోడుగా ఉంటూ జాగ్రత్తగా చూసుకోవాలని తన చిన్ననాటి స్నేహితుడు రాకేష్‌ను పంకజ్ కోరాడు. ఇదే ఆ యువ వ్యాపారి చేసిన తప్పు. 
 
పంకజ్ కోరిక మేరకు రింకీ ఇంటికి వచ్చిన రాకేష్.. ఈ లాక్‌డౌన్ సమయంలో ఆమెతో మంచి చనువు ఏర్పడింది. అది చివరకు వివాహేతర సంబంధానికి దారితీసింది. అయితే, ఈ విషయాన్ని తన ఇంట్లో అమర్చిన సీసీటీవీ కెమెరాల ద్వారా పంకజ్ కనుగొని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పంకజ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. రాకేష్‌ను అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments