Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా నిర్మూలనకు జగన్ సర్కారు కట్టుబడిలేదు : పవన్ కళ్యాణ్

Webdunia
సోమవారం, 4 మే 2020 (18:10 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ను అంతమొందించేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైకాపా సర్కారు చిత్తశుద్ధితో పని చేయడం లేదని ఆయన ఆరోపించారు. 
 
ఆయన సోమవారం అనంతపురం జిల్లాలోని జనసేన పార్టీ నేతలో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా అనంతపురం జిల్లా రైతులు, ఆ జిల్లాలోని చిక్కుకునిపోయిన వలస కూలీలు, కార్మికుల బాగోగులపై పవన్ ఆరా తీశారు. 
 
ఆ తర్వాత ఆయన పార్టీ నేతలతో మాట్లాడుతూ, కరోనా వైరస్ నిర్మూలన కోసం జగన్ సర్కారు ఏమాత్రం చిత్తశుద్ధితో పని చేయడం లేదని చెప్పుకొచ్చారు. ఇతర అంశాలపై ఉన్న శ్రద్ధ కరోనా వైరస్ నిర్మూలనపై జగన్ సర్కారు చూపించడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. 
 
అంతేకాకుండా, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులను నిలదీయాలని ఆయన పార్టీ నేతలకు సూచించారు. ఇదే పరిస్థితి కొనసాగినట్టయితే, ఈ వైరస్‌ను నిర్మూలించడం అంత సాధ్యంకాకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా, గ్రీన్, ఆరెంజ్ జోన్లకు చెందిన వారిని రెడ్ జోన్లలోకి ప్రవేశించకుండా చర్యలు తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కన్నడ తమిళం నుంచి పుట్టింది - కమల్ హాసన్

డిప్యూటీ సీఎం ఆదేశాలు.. వణికిపోతున్న థియేటర్ యజమానులు..

Chiranjeevi : కాలేజీ లెక్చరర్ గా చిరంజీవి - మెగా 157 తాజా అప్ డేట్

కమల్ వయసు 70 - త్రిష వయసు 42 యేళ్ళు.. 'థగ్‌లైఫ్' కోసం రొమాన్స్!!

థ్యాంక్యూ పవన్ జీ.. మీ ఆలోచనలతో ఏకీభవిస్తున్నాను.. దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని గుర్తించకపోతే ప్రాణాంతకం, ముందుగా స్కాన్ చేయించుకోవాలి: సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

Vitamin C Serum: మహిళల చర్మ సౌందర్యానికి వన్నె తెచ్చే విటమిన్ సి సీరం..

ఆరోగ్యానికి మేలు చేసే బఠాణీ, ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments