కరోనా పనిభారంతో ఆంబులెన్స్ డ్రైవర్ మృతి, మెడలో తాళి కుదువబెట్టి అంత్యక్రియలు చేసిన భార్య

Webdunia
శుక్రవారం, 5 జూన్ 2020 (14:18 IST)
కర్నాటక రాష్ట్రానికి చెందిన ఉమేష్, రాష్ట్ర ఆంబులెన్స్ విభాగంలో డ్రైవరుగా విధులు నిర్వహిస్తున్నాడు. గత రెండు నెలలుగా కరోనా బాధితుల కోసం రేయింబవళ్లు పనిచేస్తూ తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. విశ్రాంతి లేని కారణంగా అతడు తీవ్ర ఒత్తిడికి లోనై గుండెపోటుకు గురై కన్నుమూశాడు.
 
ఈ నేపధ్యంలో దహనక్రియలకు తన దగ్గర కావల్సినంత డబ్బు లేకపోవడంతో భార్య తన మెడలో వున్న తాళిబొట్టును కుదవబెట్టి భర్త దహనక్రియలను పూర్తి చేసింది. ఈ ఘటన స్థానికుల్లో తీవ్ర ఆవేదనను కలిగించింది. మరిణించిన ఉమేష్‌కి ఇద్దరు పిల్లలు వుండటంతో తమ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని అతడి భార్య విన్నవించింది.
 
ఈ విషాద ఘటన తెలుసుకున్న కర్నాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప, సీఎం సహాయనిధి నుంచి రూ. 5 లక్షలు మంజూరు చేస్తామని ప్రకటించారు. ఈ నేపధ్యంలో ఉమేష్ భార్య తన భర్త లాక్ డౌన్ ప్రకటించిన మూడు నెలలుగా విశ్రాంతి లేకుండా విధులు నిర్వహించడంతో తీవ్ర ఒత్తిడికి గురయ్యారనీ, దీనితో ఆకస్మిక గుండెపోటు సంభవించడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించారని తెలిపింది. తమ కుటుంబానికి ఆధారమైన తన భర్త చనిపోవడంతో ఏ ఆధారంలేకుండో పోయిందని, ప్రభుత్వమే తమకు ఏదయినా ఉద్యోగం కల్పించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Drishyam 3: దృశ్యం 3 వంటి కథలు ముగియవు - పనోరమా స్టూడియోస్, పెన్ స్టూడియోస్‌

SS thaman: ఎస్ థమన్ ట్వీట్.. తెలుగు సినిమాలో మిస్టీరియస్ న్యూ ఫేస్ ఎవరు?

పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి అదిరిపోయే అప్‌డేట్

హోటల్ గదిలో ఆత్మను చూశాను... : హీరోయిన్ కృతిశెట్టి

ఫ్యాన్స్‌కు మెగా ఫీస్ట్ - ఎంఎస్‌జీ నుంచి 'శశిరేఖ' లిరికల్ సాంగ్ రిలీజ్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments