ఉరిశిక్షలకు ప్రత్యామ్నాయం లేదా? సుప్రీంకోర్టు ప్రశ్న

Webdunia
బుధవారం, 3 మే 2023 (10:38 IST)
తీవ్ర నేరాలకు పాల్పడి ఉరిశిక్ష పడే ఖైదీలను చివరి క్షణాల్లో నొప్పి కలగకుండా అంటే ఉరి వేసి చంపకుండా ఉండేలా ఇతర ప్రత్యామ్నాయ మార్గాలు లేవా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. మరణశిక్షను ఉరి తీయడం రూపంలోనే అమలు చేయాలా అని అడిగింది. దీనికి వేరే విధానం లేదా అని ప్రశ్నించింది. దీనికి కేంద్రం తన అభిప్రాయాన్ని వెల్లడించింది. ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణ కోసం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసినట్టు తెలిపింది. 
 
ఉరికొయ్యకు వేలాడదీయడం కన్నా తక్కువ బాధను కలిగించే ఇంజెక్షన్లు ఇవ్వడం, షూట్ చేయడం, కరెంటు షాకు ఇవ్వడం, గ్యాస్ ఛాంబర్లలో పెట్టడం వంటి ప్రత్యామ్నాయ విధానాలు అమలు చేయాలని కోరుతూ న్యాయవాది రిషి మల్హోత్రా 2017లో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ కేసును తాజాగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ జె.బి.పార్టీవాలాల ధర్మాసనం విచారణకు చేపట్టింది. 
 
కేంద్ర ప్రభుత్వం తరపున అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి సమాధానం చెబుతూ దీనిపై నిపుణుల కమిటీ ఏర్పాటు చేసే అలోచన ఉందని, ఇందుకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. నిపుణులను ఎంపిక చేసే పనిలో ఉన్నామన్నారు. దీంతో తదుపరి విచారణను వేసవి సెలవుల తర్వాత చేపట్టనున్నట్టు కోర్టు ప్రకటించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Gopal Varma: రాంగోపాల్ వర్మ.. షో మ్యాన్..మ్యాడ్ మాన్స్టర్

Shivaj :ఓవర్సీస్ ప్రీమియర్లతో సిద్ధం చేస్తున్న ధండోరా

Dhanush: కృతి స‌న‌న్ తో ప్రేమలో మోసపోయాక యుద్ధమే అంటున్న ధనుష్ - అమ‌ర‌కావ్యం (తేరే ఇష్క్ మై)

అఖండ 2 డిసెంబర్ 12న వస్తోందా నిర్మాతలు ఏమన్నారంటే?

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం