Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉరిశిక్షలకు ప్రత్యామ్నాయం లేదా? సుప్రీంకోర్టు ప్రశ్న

Webdunia
బుధవారం, 3 మే 2023 (10:38 IST)
తీవ్ర నేరాలకు పాల్పడి ఉరిశిక్ష పడే ఖైదీలను చివరి క్షణాల్లో నొప్పి కలగకుండా అంటే ఉరి వేసి చంపకుండా ఉండేలా ఇతర ప్రత్యామ్నాయ మార్గాలు లేవా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. మరణశిక్షను ఉరి తీయడం రూపంలోనే అమలు చేయాలా అని అడిగింది. దీనికి వేరే విధానం లేదా అని ప్రశ్నించింది. దీనికి కేంద్రం తన అభిప్రాయాన్ని వెల్లడించింది. ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణ కోసం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసినట్టు తెలిపింది. 
 
ఉరికొయ్యకు వేలాడదీయడం కన్నా తక్కువ బాధను కలిగించే ఇంజెక్షన్లు ఇవ్వడం, షూట్ చేయడం, కరెంటు షాకు ఇవ్వడం, గ్యాస్ ఛాంబర్లలో పెట్టడం వంటి ప్రత్యామ్నాయ విధానాలు అమలు చేయాలని కోరుతూ న్యాయవాది రిషి మల్హోత్రా 2017లో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ కేసును తాజాగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ జె.బి.పార్టీవాలాల ధర్మాసనం విచారణకు చేపట్టింది. 
 
కేంద్ర ప్రభుత్వం తరపున అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి సమాధానం చెబుతూ దీనిపై నిపుణుల కమిటీ ఏర్పాటు చేసే అలోచన ఉందని, ఇందుకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. నిపుణులను ఎంపిక చేసే పనిలో ఉన్నామన్నారు. దీంతో తదుపరి విచారణను వేసవి సెలవుల తర్వాత చేపట్టనున్నట్టు కోర్టు ప్రకటించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bhavana : నా భర్తతో సంతోషంగా వున్నాను.. విడాకుల కథలన్నీ అబద్ధాలే: భావన

ఆర్ట్ డైరెక్ట‌ర్‌ల‌తో డైరెక్ట‌ర్ల‌ బంధం ఎంతో ముఖ్య‌మైంది : హరీష్ శంకర్

య‌ష్ లేటెస్ట్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోనప్స్’ సెట్స్‌లో అమెరిక‌న్ న‌టుడు కైల్ పాల్‌

Mohan Babu: పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్నా.. నేను మీ పక్కన ఉండే అవకాశాన్ని కోల్పోయాను (video)

Prabhas: థమన్ వల్లే రాజా సాబ్ విడుదల లేట్ అవుతుందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం