Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుజరాత్ సచివాలయంలోకి చిరుత.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

Webdunia
సోమవారం, 5 నవంబరు 2018 (12:55 IST)
గుజరాత్ సచివాలయంలోకి చిరుత ప్రవేశించింది. పటిష్ట బందోబస్తు వున్నప్పటికీ సెక్యూరిటీ కళ్లుగప్పి చిరుత సచివాలయంలోకి ప్రవేశించింది. గుజరాత్, గాంధీనగర్‌‌లోని అత్యంత భారీ భద్రతను దాటుకుని లోపలికి ప్రవేశించింది. 
 
గేట్లు మధ్య ఉన్న ఖాళీ స్థలం ద్వారా ప్రవేశించడం.. ఈ చిరుత ఎంట్రీ ఇవ్వడం సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. అహ్మదాబాద్‌లో కొత్తగా నిర్మించిన సచివాలయం భవనం, ముఖ్యమంత్రి కార్యాలయం పరిసరాల్లోకి ఓ చిరుతపులి ప్రవేశించడం తీవ్ర కలకలం రేపింది. 
 
చిరుత ప్రవేశించిన విజువల్స్ చూసి అధికారులు షాకయ్యారు. వెంటనే రంగ ప్రవేశం చేసిన అధికారులు, ఉదయం నుంచి చిరుత జాడ కోసం వెతుకులాట ప్రారంభించారు. మరోవైపు ఇంద్రోదా పార్క్ నుంచి ఈ చిరుత పులి ప్రవేశించి వుండవచ్చని అధికారులు భావిస్తున్నారు.
 
ఇక తాజా ఘటనలో అలర్టైన అధికారులు చిరుత మళ్లీ వస్తే పట్టుకునేందుకు బోనులను ఏర్పాటు చేశారు. చిరుత ఎటు వెళ్లిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం గుజరాత్ సచివాలయంలోకి చిరుత ప్రవేశానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పింటు కి పప్పీ మైత్రి మూవీ మేకర్స్ ద్వారా కిస్ కిస్ కిస్సిక్ గా విడుదల

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ జాక్ నుంచి ఫస్ట్ సింగిల్ పాబ్లో నెరుడా రిలీజ్

మైండ్ స్పేస్ ఎకో రన్ లో ఆకట్టుకున్న సంతాన ప్రాప్తిరస్తు టీజర్

ఎన్నో కష్టాలు పడ్డా, ల్యాంప్ సినిమా రిలీజ్ కు తెచ్చాం :చిత్ర యూనిట్

మంచి సందేశాన్ని ఇచ్చే బందీని ఆదరిస్తున్న ఆడియెన్స్‌కు థాంక్స్ : ఆదిత్య ఓం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిరోజూ పసుపు, జీలకర్ర నీటిని తీసుకుంటే..? మహిళల్లో ఆ సమస్యలు మాయం

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

మహిళలు బెల్లం ఎందుకు తినాలో తెలుసా?

మహిళలు ప్రతిరోజూ ఆపిల్ కాదు.. ఆరెంజ్ పండు తీసుకుంటే.. ఏంటి లాభమో తెలుసా?

Hibiscus Flower: మహిళలకు మెరిసే అందం కోసం మందార పువ్వు

తర్వాతి కథనం
Show comments