Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాదాస్పద వ్యవసాయ బిల్లులకు రాజ్యసభ ఆమోదం

Webdunia
ఆదివారం, 20 సెప్టెంబరు 2020 (15:03 IST)
ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివాదాస్పద మూడు వ్యవసాయ బిల్లులకు రాజ్యసభ ఆదివారం మూజువాణి ఓటుతో ఆమోదముద్రవేసింది. అంతకుముందు సభలో రైతులకు నష్టం చేకూర్చేలా బిల్లు ఉందంటూ విపక్షాలు తీవ్రంగా ధ్వజమెత్తాయి. దాదాపు 14 విపక్ష పార్టీలు ముక్త కంఠంతో బిల్లును వ్యతిరేకించాయి. కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్ సభలో బిల్లులను ప్రవేశపెట్టిన వెంటనే విపక్ష సభ్యులు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం బిల్లుపై రచ్చ జరిగింది.
 
కొందరు బిల్లుల ప్రతులను చింపేసి విసిరేశారు. మరికొందరు డిప్యూటీ చైర్మన్ మైక్‌ను లాగేందుకు ప్రయత్నించారు. గందరగోళం మధ్య సభను డిప్యూటీ చైర్మన్ కాసేపు వాయిదా వేశారు. అనంతరం సభ ప్రారంభమైన తర్వాత విపక్షాల నినాదాల మధ్యే మూజువాణి ఓటుతో బిల్లులకు ఆమోద ముద్రవేశారు. అనంతరం సభను సోమవారాని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. 
 
ఇదిలావుండగా, కేంద్రం కొత్తగా తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లును రాజ్యసభలో తెరాస ఎంపీలు ముక్త కంఠంతో వ్యతిరేకించారు. ఈ సందర్భంగా పార్టీ పార్లమెంటరీ పక్షనేత, ఎంపీ కేశవరావు మాట్లాడారు. కొత్త వ్యవసాయ బిల్లుతో రైతులను తీరని నష్టం జరిగే అవకాశముందని అన్నారు. రాజ్యాంగ విరుద్ధంగా కేంద్రం బిల్లును రూపొందించిందని ఆక్షేపించారు. రైతులకు అండగా లేని ఇలాంటి చట్టాలు ఎందుకని ఆయన ప్రశ్నించారు.
 
వ్యవసాయ రంగంలోనూ కార్పొరేట్లను పెంచి పోషించేలా.. మార్కెటింగ్‌ ఏజెంట్లకు సైతం నష్టం కలిగించేలా ఈ కొత్త చట్టం ఉందని పేర్కొన్నారు. కేంద్రం ఏ పథకానికి సక్రమంగా నిధులు ఇవ్వడం లేదని మండిపడ్డారు. రాష్ట్రాల హక్కులను హరించేలా కేంద్రం వ్యవహరిస్తోందన్నారు. రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తోందని గుర్తుచేశారు. మరోవైపు, ఈ బిల్లులకు టీడీపీ, వైకాపాలు సంపూర్ణ మద్దతు తెలిపాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అల్లు కనకరత్నం కు నివాళి అర్పించిన రామ్ చరణ్, అన్నాలెజినోవా

అల్లు రామలింగయ్య భార్య అల్లు కనకరత్నమ్మ మృతి

Nag: నాగార్జున 100వ చిత్రం, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన నాగ చైతన్య టీమ్

పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన మైథలాజికల్ థ్రిల్లర్ మయూఖం

గ్రాండ్ పేరెంట్స్‌‌కి ఉచితంగా ప్రదర్శించనున్న త్రిబాణధారి బార్బరిక్ టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments