కర్ణాటకలో బీజేపీ అయితే బీహార్‌లో మాదే పెద్దపార్టీ : తేజశ్వి

కర్ణాటక రాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించిందని భావిస్తే, బీహార్ రాష్ట్రంలో అతిపెద్ద పార్టీ మాదేనని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు, బీహార్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి తేజశ

Webdunia
గురువారం, 17 మే 2018 (09:02 IST)
కర్ణాటక రాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించిందని భావిస్తే, బీహార్ రాష్ట్రంలో అతిపెద్ద పార్టీ మాదేనని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు, బీహార్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి తేజశ్వియాదవ్ గుర్తుచేశారు. అందువల్ల ప్రభుత్వ ఏర్పాటుకు తమకే తొలుత అవకాశం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
 
మంగళవారం వెల్లడైన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ లభించలేదు. దీంతో అక్కడి గవర్నర్... ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలుచుకున్న బీజేపీకి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశమిచ్చారు. దీనిపై బీహార్ మాజీ ఉపముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజశ్వియాదవ్ తీవ్ర విమర్శలు చేశారు. 
 
కర్ణాటకలో అతిపెద్ద పార్టీ అయినందున బీజేపీకి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశమిచ్చినందున, బీహార్‌లోనూ మాకూ అవకాశమివ్వాలన్నారు. బీహార్‌లో మాదే అతిపెద్ద పార్టీ అని స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పెద్ద పార్టీనే అవసరమైతే, బీహార్‌లో అతిపెద్ద పార్టీ ఆర్జేడీనే అన్నారు. 
 
సింగిల్ లార్జెస్ట్ పార్టీకి కర్ణాటకలో గవర్నర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించారు. అందుకే రాష్ట్రపతి... బీహార్ ప్రభుత్వాన్ని రద్దుచేసి, సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయిన ఆర్జేడీకి ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే, మహా కూటమి 2019 ఎన్నికల్లో బీజేపీని చిత్తుగా ఓడిస్తుందని ఆయన జోస్యం చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రేమ లేదని చెబుతున్న లక్ష్మణ్ టేకుముడి, రాధికా జోషి

Director Vasishta, : జంతువుల ఆత్మతోనూ కథ తో నెపోలియన్ రిటర్న్స్

Vishnu: విష్ణు విశాల్... ఆర్యన్ నుంచి లవ్లీ మెలోడీ పరిచయమే సాంగ్

Gopichand: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి సినిమా భారీ ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్

నారా రోహిత్, శిరీష ప్రీ - వెడ్డింగ్ వేడుకలు ప్రారంభం.. పెళ్లి ముహూర్తం ఎప్పుడంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments