Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆ పరీక్ష పాస్ అయితే రూ.లక్ష బహుమతి.. ఎక్కడ?

బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ విద్యార్థులకు శుభవార్త తెలిపారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (యూపీఎస్సీ), బీహార్ పబ్లిక్ సర్వీస్ కమీషన్(బీపీఎస్సీ) నిర్వహించే సివిల్స్ ఎగ్జామ్‌లో ప్రిలిమినర

Advertiesment
Nitish Kumar
, బుధవారం, 9 మే 2018 (12:27 IST)
బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ విద్యార్థులకు శుభవార్త తెలిపారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (యూపీఎస్సీ), బీహార్ పబ్లిక్ సర్వీస్ కమీషన్(బీపీఎస్సీ) నిర్వహించే సివిల్స్ ఎగ్జామ్‌లో ప్రిలిమినరీ పరీక్ష ఉత్తీర్ణులైన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 50 వేల రూపాయల బహుమతి అందజేయనున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం(మే-8) జరిగిన బీహార్ రాష్ట్ర కేబినెట్ భేటీలో నితీష్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
 
అలాగే, ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ కూడా లక్ష రూపాయల వరకు ఆర్థిక సాయం చేసే ప్రతిపాదనకు సీఎం నితీశ్ కుమార్ ఆమోదముద్రవేశారు. "అనుసుచిత్ జతి ఇవమ్ అనుసుచిత్ జన్‌జాతి యోజన స్కీమ్" పేరుతో విద్యార్ధులకు ఈ సాయం అందిస్తున్నట్లు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాముకి ఇలా ప్రాణం పోశారు..