Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరెన్సీ నోట్లపై లక్ష్మీ దేవి బొమ్మ : సుబ్రహ్మణ్యం స్వామి

Webdunia
గురువారం, 16 జనవరి 2020 (07:19 IST)
భారతీయ కరెన్సీ నోట్లపై లక్ష్మీ దేవి బొమ్మను ముద్రించాలని బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యం స్వామి కేంద్రప్రభుత్వానికి సూచించారు. అలా చేస్తే అందరికీ మేలు జరుగుతుందని చెప్పారు.

ఇండోనేషియా కరెన్సీ నోట్లపై గణేశుని బొమ్మను ముద్రించిన విషయాన్ని ప్రస్తావిస్తూ విలేకర్లు అడిగిన ప్రశ్నకు స్వామి స్పందించారు. సుబ్రహ్మణ్యం స్వామి మధ్య ప్రదేశ్‌లోని ఖాండ్వాలో ‘స్వామి వివేకానంద వ్యాఖ్యానమాల’ శీర్షికతో ప్రసంగించారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు.

ఇండోనేషియా కరెన్సీ నోట్లపై గణేశుని బొమ్మ ముద్రించిన విషయాన్ని విలేకర్లు ప్రస్తావించినపుడు స్వామి మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలన్నారు. తాను దీనికి అనుకూలంగా ఉన్నట్లు తెలిపారు.

గణేశుడు విఘ్నాలను తొలగిస్తాడని చెప్పారు. లక్ష్మీదేవి బొమ్మను కరెన్సీ నోట్లపై ముద్రిస్తే, భారతీయ కరెన్సీ పరిస్థితిని మెరుగుపడవచ్చునని చెప్పారు. దీని గురించి ఎవరూ చెడుగా అనుకోవలసిన అవసరం లేదన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వినోదంతోపాటు నాకంటూ హిస్టరీ వుందంటూ రవితేజ మాస్ జాతర టీజర్ వచ్చేసింది

వింటేజ్ రేడియో విరిగి ఎగిరిపోతూ సస్పెన్స్ రేకెత్తిస్తున్న కిష్కిందపురి పోస్టర్‌

Mangli: ఏలుమలై నుంచి మంగ్లీ ఆలపించిన పాటకు ఆదరణ

Ram: పరదా వెనుక ఉప్మాపాప (అనుపమ) పవర్ త్వరలో మీకే తెలుస్తుంది : రామ్ పోతినేని

NTR: ఆయన ఆశీస్సులు వున్నంతకాలం నన్నెవరూ ఆపలేరు : ఎన్.టి.ఆర్.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

Business Ideas: మహిళలు ఇంట్లో వుంటూనే డబ్బు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా?

Javitri for Skin: వర్షాకాలంలో మహిళలు జాపత్రిని చర్మానికి వాడితే..?.. ఆరోగ్యానికి కూడా?

తర్వాతి కథనం
Show comments