Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరెన్సీ నోట్లపై లక్ష్మీ దేవి బొమ్మ : సుబ్రహ్మణ్యం స్వామి

Webdunia
గురువారం, 16 జనవరి 2020 (07:19 IST)
భారతీయ కరెన్సీ నోట్లపై లక్ష్మీ దేవి బొమ్మను ముద్రించాలని బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యం స్వామి కేంద్రప్రభుత్వానికి సూచించారు. అలా చేస్తే అందరికీ మేలు జరుగుతుందని చెప్పారు.

ఇండోనేషియా కరెన్సీ నోట్లపై గణేశుని బొమ్మను ముద్రించిన విషయాన్ని ప్రస్తావిస్తూ విలేకర్లు అడిగిన ప్రశ్నకు స్వామి స్పందించారు. సుబ్రహ్మణ్యం స్వామి మధ్య ప్రదేశ్‌లోని ఖాండ్వాలో ‘స్వామి వివేకానంద వ్యాఖ్యానమాల’ శీర్షికతో ప్రసంగించారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు.

ఇండోనేషియా కరెన్సీ నోట్లపై గణేశుని బొమ్మ ముద్రించిన విషయాన్ని విలేకర్లు ప్రస్తావించినపుడు స్వామి మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలన్నారు. తాను దీనికి అనుకూలంగా ఉన్నట్లు తెలిపారు.

గణేశుడు విఘ్నాలను తొలగిస్తాడని చెప్పారు. లక్ష్మీదేవి బొమ్మను కరెన్సీ నోట్లపై ముద్రిస్తే, భారతీయ కరెన్సీ పరిస్థితిని మెరుగుపడవచ్చునని చెప్పారు. దీని గురించి ఎవరూ చెడుగా అనుకోవలసిన అవసరం లేదన్నారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments