Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజస్థాన్‌లో కలియుగ కుంభకర్ణుడు!

Webdunia
బుధవారం, 14 జులై 2021 (07:24 IST)
కుంభకర్ణుడు అనే రాక్షసుడు ఏడాదిలో ఏకబిగిన ఆర్నెల్లు నిద్రపోతాడనేది పురాణగాథ. సుదీర్ఘ నిద్రలో కుంభకర్ణుడినే తలదన్నెవాడొకడు రాజస్థాన్‌లో ఉన్నాడు.

అతడు నెలల లో వరుసగా 25 రోజులు నిద్రలోనే గడుపుతాడు. అంటే ఏడాదిలో 300 రోజులు గుర్రుపెడతాడన్నమాట. సంవత్సరంలో ఓ యాభై రోజులు మాత్ర మే స్పృహలో ఉంటాడు. నిద్రాదేవి ఇంతలా ఆవహించిన ఆయన 42 ఏళ్ల పుర్కారామ్‌! ఊరు నాగౌర్‌.

ఈ నిద్ర ఆయన కోరుకున్నది కాదు. ‘ఆక్సిస్‌ హైపర్‌ సోమ్నియా’ అనే స్లీపింగ్‌ డిజార్డర్‌తో ఆయన బాధపడుతున్నారు. 25 రోజుల తర్వాత నిద్రలేచినప్పుడే ఆయనకు స్నానం చేయించి భోజనం పెడుతున్నారు కుటుంబసభ్యులు!

23 ఏళ్ల వయసులో ఆయన ఈ అరుదైన వ్యాధి బారినపడ్డారు. తొలుత రోజులో 15 గంటలు నిద్రపోయేవాడు. తర్వాత ఆ సమయం పెరుగుతూ పెరుగుతూ నెలలో 25 రోజుల పాటు నిద్రావస్థలోనే గడిపేస్థాయికి చేరుకున్నారు. అన్నట్టు.. పుర్కారామ్‌కు పెళ్లయింది. తన భర్త త్వరలోనే కోలుకుంటాడన్న ఆశాభావాన్ని భార్య వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

Dhanush: పవన్ కళ్యాణ్ సినిమానే ధనుష్ ఎందుకు డైరెక్ట్ చేస్తానన్నాడు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

తర్వాతి కథనం
Show comments