Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోల్‌కతా మెడికో హత్య కేసులో బిగ్ ట్విస్ట్ : ఘటన జరిగిన తర్వాత సెమినార్ హాలులో సందడి!

ఠాగూర్
మంగళవారం, 27 ఆగస్టు 2024 (15:35 IST)
కోల్‌కతా మెడికో హత్యాచార కేసులో బిగ్ ట్విస్ట్ ఒకటి చోటుచేసుకుంది. ఘటన జరిగిన తర్వాత సెమినార్ హాలులోకి అనేక మంది వెళ్లి సందడి సందడిగా గడిపారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు వెలుగులోకి రావడం వైరల్ కావడం జరుగుతుంది. మెడికోపై అత్యాచారం, హత్య ఘటన తర్వాత డాక్టర్ దేబాశిష్ సోమ్ (సందీప్ ఘోష్ సన్నిహితుడు, ఆర్జీ కర్ ఆస్పత్రి ఫోరెన్సిక్ విభాగం వైద్యుడు), పోలీసులు, ఆర్జీ కర్ ఆస్పత్రి మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ న్యాయవాది శంతన డే, ఘోష్ పీఏ, ఆస్పత్రి ఔట్ పోస్టు సిబ్బంది సెమినార్ హాలులో కనిపించారు. వీరంతా ఏదో విషయాన్ని చర్చించుకోవడం కనిపించింది. అయితే, ఈ వీడియోలో భాధిత వైద్యురాలి మృతదేహం మాత్రం కనిపించకపోవడం గమనార్హం. 
 
అయితే, ఇపుడు ఈ వీడియో అనేక అనుమానాలకు, ప్రశ్నలకు తావిస్తుంది. వీరందరూ కలిసి ఆధారు చెరివేసే ప్రయత్నం చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసలు వారందరూ ఆ గదిలోకి ఎదుకు వెళ్ళారు. ఏం చర్చించుకుంటున్నారన్న విషయం మాత్రం ప్రశ్నార్థకంగా మారింది. అదేసమయంలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై డిప్యూటీ పోలీస్ కమిషనర్ ఇందిరా ముఖర్జీ స్పందించారు. 
 
పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణులు, సంబంధిత వ్యక్తులు మాత్రమే లోపలికి వెళ్లారని, అది కూడా నిషేధిత ప్రాంతంలోకి వెళ్లలేదని పేర్కొన్నారు. మరి లాయర్ అక్కడ ఎందుకు ఉన్నారన్న ప్రశ్నకు మాత్రం ఆమె సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు. ఆ తర్వాత మాట్లాడుతూ, ఈ విషయం గురించి ఆస్పత్రి అధికారులు మాత్రమే చెప్పగలరని పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments