చెత్త పన్ను చెల్లించమన్న మేయర్.. చెత్త తీసుకెళ్లి మేయర్ ఇంట్లో పోసిన ప్రజలు (Video)

ఠాగూర్
మంగళవారం, 27 ఆగస్టు 2024 (15:10 IST)
వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ సొంత జిల్లా కడపలో ప్రజలు తిరుగుబాటు చేశారు. గత వైకాపా ప్రభుత్వంలో ఐదేళ్ల పాటు కుక్కినపేనులా పడివున్న కడప ప్రజలు ఇపుడు అధికారం మారడంతో వైకాపా నేతలపై రెచ్చిపోతున్నారు. తాజాగా వైకాపాకు చెందిన కడప మేయర్‌కు వారు తగిన గుణపాఠం నేర్పించారు. 
 
చెత్తపన్ను చెల్లించాలని, పన్ను చెల్లిస్తేనే చెత్తను సేకరిస్తామంటూ వైకాపాకు చెందిన కడప మేయర్ సురేశ్ బాబు ప్రకటించారు. ఆయన పిలుపుని కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ చెత్త పన్ను చెల్లించనేవద్దంటూ పిలుపునిచ్చారు. దీంతో ప్రజలు చెత్త పన్ను చెల్లించలేదు. దీన్ని అవమానంగా భావించిన మేయరు.. చెత్త సేకరించవద్దంటూ సిబ్బందికి మౌఖిక ఆదేశాలు జారీచేశారు. 
 
ఈ ఆదేశాలు ప్రజలకు మరింత ఆగ్రహాన్ని తెప్పించాయి. తమ ఇళ్లలోని చెత్తలంతా సేకరించి కడప వైకాపా మేయర్ ఇంటి ముందు పోశారు. అప్పటికీ శాంతించని కొందరు యువకులు.. ఆ చెత్తను మేయర్ ఇంటి హాలులో కూడా విసిరి వేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments