Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెత్త పన్ను చెల్లించమన్న మేయర్.. చెత్త తీసుకెళ్లి మేయర్ ఇంట్లో పోసిన ప్రజలు (Video)

ఠాగూర్
మంగళవారం, 27 ఆగస్టు 2024 (15:10 IST)
వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ సొంత జిల్లా కడపలో ప్రజలు తిరుగుబాటు చేశారు. గత వైకాపా ప్రభుత్వంలో ఐదేళ్ల పాటు కుక్కినపేనులా పడివున్న కడప ప్రజలు ఇపుడు అధికారం మారడంతో వైకాపా నేతలపై రెచ్చిపోతున్నారు. తాజాగా వైకాపాకు చెందిన కడప మేయర్‌కు వారు తగిన గుణపాఠం నేర్పించారు. 
 
చెత్తపన్ను చెల్లించాలని, పన్ను చెల్లిస్తేనే చెత్తను సేకరిస్తామంటూ వైకాపాకు చెందిన కడప మేయర్ సురేశ్ బాబు ప్రకటించారు. ఆయన పిలుపుని కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ చెత్త పన్ను చెల్లించనేవద్దంటూ పిలుపునిచ్చారు. దీంతో ప్రజలు చెత్త పన్ను చెల్లించలేదు. దీన్ని అవమానంగా భావించిన మేయరు.. చెత్త సేకరించవద్దంటూ సిబ్బందికి మౌఖిక ఆదేశాలు జారీచేశారు. 
 
ఈ ఆదేశాలు ప్రజలకు మరింత ఆగ్రహాన్ని తెప్పించాయి. తమ ఇళ్లలోని చెత్తలంతా సేకరించి కడప వైకాపా మేయర్ ఇంటి ముందు పోశారు. అప్పటికీ శాంతించని కొందరు యువకులు.. ఆ చెత్తను మేయర్ ఇంటి హాలులో కూడా విసిరి వేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అద్రుష్టం నావైపు వుందేమోనని అనుకుంటున్నా : యాంకర్ వింధ్య విశాఖ

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నుండి దర్శకురాలి దాకా....

వరద బాధితులకు 6 లక్షల విరాళం ప్రకటించిన శింబు

మూడు పాత్రలని ఎందుకు చేయాలో దర్శకుడు చెప్పాక కన్విన్స్ అయ్యా : హీరో టోవినో థామస్

ఎన్టీఆర్‌, సైఫ్ మ‌ధ్య ఉన్న స‌న్నివేశాలే నెక్ట్స్ లెవ‌ల్‌గా దేవర థియేట్రికల్ ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిన్ని చిన్ని గసగసాల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. మహిళలకు?

రాత్రి పూట ఒక్క యాలుక్కాయను తింటే చాలు ఆ సమస్యలన్నీ ఔట్

ఈ పానీయాలలో ఐరన్ పుష్కలం, ఏంటవి?

శరీర కొవ్వు కరిగించేందుకు రాగి దోసె

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే కలిగే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments