Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొట్టాయంలో వెలుగు చూసిన బర్డ్‌ఫ్లూ - కోళ్ళు - బాతుల సమూహిక హననం

Webdunia
బుధవారం, 15 డిశెంబరు 2021 (08:46 IST)
ఇప్పటికే దేశ ప్రజలు కరోనా, డెల్టా, ఒమిక్రాన్ వంటి వైరస్‌లతో బెంబేలెత్తిపోతున్నారు. ఇపుడు మళ్లీ బర్డ్ ఫ్లూ వెలుగు చూసింది. కేరళ రాష్ట్రంలోని కొట్టాయంలో ఈ వైరస్ సోకి బాతులు కోళ్లు చనిపోతున్నాయి. దీంతో వేలాది కోళ్ళను హననం చేస్తున్నారు. ముఖ్యంగా, బాతులు, కోళ్ళను చంపి తగలబెట్టేందుకు కేరళ ప్రభుత్వం ప్రత్యేక బృందాలను సైతం నియమించింది. 
 
ఈ రాష్ట్రంలో ఇప్పటికే వేలాది కోళ్ళకు ఫ్లూ సోకింది. ముఖ్యంగా కొట్టాయం జిల్లాలో మూడు బర్డ్ ఫ్లూ కేసులు తాజాగా బయటపడ్డాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా బుధవారం నుంచి కోళ్లు, బాతులను సామూహిక హననం చేయాలని నిర్ణయించారు. జిల్లాలోని వేచూరు, ఆయమనమ్, కల్లార పంచాయతీలలో పక్షుల నుంచి సేకరించిన నమూనాలను భోపాల్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డీసీజెస్‌ కేంద్రంలో పరీక్షించగా, బర్డ్ ఫ్లూ సోకినట్టు నిర్ధారణ అయింది. 
 
దీంతో వైరస్ అడ్డుకట్ట వేసేందుకు కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్ పీకే జయశ్రీ అధికారులను ఆదేశించారు. గతవారం పక్కనే ఉన్న అళప్పుళ జిల్లాలోనూ బర్డ్ ఫ్లూ వెలుగులోకి రావడంతో నియంత్రణ చర్యల్ల భాగంగా, కోళ్లను, బాతులను చంపేశారు. 
 
తాజాగా అదే పరిస్థితి చేయనున్నారు. దీంతో కోళ్ళ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదేసమయంలో బర్డ్ ఫ్లూ మనుషులకు సోకే ప్రమాదం చాలా తక్కువగా ఉందని, ఒకవేళ సంక్రమిస్తే మాత్రం సమస్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas and Anushka: ప్రభాస్‌తో కలిసి నటిస్తాను అంటోన్న దేవసేన (video)

Krish: పవన్ కళ్యాణ్ అంటే అభిమానమే.. - ఇప్పుడు సినిమా లైఫ్ మూడు గంటలే : క్రిష్ జాగర్లమూడి

అథర్వా మురళి నటించిన యాక్షన్ థ్రిల్లర్ టన్నెల్

అంకిత్ కొయ్య, నీలఖి ల కెమిస్ట్రీ, స్కూటీ చుట్టూ తిరిగే బ్యూటీ గా లవ్ సాంగ్‌

Rehman: ఏఆర్ రహ్మాన్ బాణీలతో రామ్ చరణ్ పెద్ది ఫస్ట్ సింగిల్ సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments