Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుర్గమ్మ సేవలో బాలయ్య - ఇంద్రకీలాద్రిలో బోయపాటితో కలిసి పూజలు

Webdunia
బుధవారం, 15 డిశెంబరు 2021 (08:23 IST)
సినీ హీరో యువరత్న బాలకృష్ణ బుధవారం దుర్గామాతను దర్శించుకున్నారు. చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీనుతో కలిసి ఇంద్రకీలాద్రికి వచ్చిన ఆయన ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. బాలయ్య, బోయపాటిలకు ఆలయ మర్యాదలతో దుర్గగుడి అధికారులు స్వాగతం పలికారు. ఆ తర్వాత అమ్మవారిని దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 
 
ఈ సందర్భంగా బాలకృష్ణ, బోయపాటి శ్రీనులకు అమ్మవారి చిత్రపటంతో పాటు వేద ఆశీర్వచనం అందించారు. కాగా, ఇటీవల బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన "అఖండ" చిత్రం ఘన విజయం సాధించిన విషయం తెల్సిందే. ఈ సినిమా ఈ నెల 2వ తేదీన విడుదలై ప్రపంచ వ్యాప్తంగా సూపర్ టాక్‌తో అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. 
 
ఈ చిత్రం విజయంపై బాలకృష్ణ మాట్లాడుతూ, ప్రేక్షకులు ఎల్లవేళలా మంచి సినిమాలకు బ్రహ్మరథం పడుతారని మరోమారు నిరూపితమైందన్నారు. ఈ చిత్రాన్ని ఇంత విజయవంతం చేసిన దాన్ని నిరూపించిన ప్రేక్షకులకు ప్రత్యేక ధన్యవాదాలు అని అన్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sugar Baby: నటి త్రిష కృష్ణన్‌పై ట్రోల్స్.. కారణం ఏంటంటే?

'ఆయన కొడుకు వచ్చాడని చెప్పు' ... మంచు మనోజ్ ఆసక్తికర ట్వీట్

Bhairavam Review: భైరవం సినిమా ఎలా ఉందో తెలుసా..!

పచ్చని జీవితంలో నిప్పులు పోసిన కేన్సర్: టీవీ నటి దీపిక కాకర్‌కు లివర్ కేన్సర్

రొమాంటిక్ కామెడీ చిత్రంలో జాన్వీ కపూర్ - అందాల ఆరబోత?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments