Webdunia - Bharat's app for daily news and videos

Install App

సొంతింటికే కన్నం వేసిన ఘనులు.. ఆ తర్వాత కారం చల్లి...

Webdunia
ఆదివారం, 26 మార్చి 2023 (18:01 IST)
తన స్నేహితుల సహకారంతో సొంతింటికే కన్నం వేశాడో యువకుడు. ఆ తర్వాత ఈ ఘటన వెలుగులోకి రావడంతో దాన్నిదాచిపెట్టేందుకు ఆనవాళ్లు లేకుండా చేసేందుకు కారం చల్లి కప్పిపుచ్చాలని భావించాడు. చివరకు పోలీసుల చేతికి చిక్కాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
 
కేరళ రాష్ట్రంలోని పాలక్కాడ్ పుదుపరియారానికి చెందిన బైజు అనే యువకుడు తన స్నేహితులు సుని, సుశాంత్‌లతో కలిసి దోపిడీకి ప్లాన్ చేశారు. ఆర్థిక కష్టాలను ఆధికమించేందుకు సొంత ఇంటిలోనే చోరీకి పాల్పడ్డాడు. 
 
తన స్నేహితులకు భారీ మొత్తంలో డబ్బు ఆఫర్ చేసి వారిన ఒప్పించి, తన ఇంటిలో చోరీకి తీసుకెళ్లాడు. ఆ ఇంటికి వెళ్లిన తర్వాత తలుపులు తెరిచే అవకాశం ఉన్నప్పటికీ ఆపని చేయకుండా తలుపులు బద్ధలుకొట్టిన బైజు.. ఇంటిలోని బంగారం, డబ్బు, ఇతరాత్రా విలువైన వస్తువులను దోచుకున్నాడు. పైగా, చోరీ చేసిన ఆనవాళ్లు లభించకుండా ఉండేందుకు వీలుగా ఇంట్లో కారం చల్లి, వస్తువులను చిందరవందరగా పడేసి తన స్నేహితులతో కలిసి వెళ్లిపోయాడు.
 
ఇంతలో ఆలయానికి వెళ్లిన బైజు తల్లిదండ్రులు ఇంటికి తిరిగి వచ్చి చూడగా, చోరీ జరిగినట్టు గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించిన తర్వాత బైజును అనుమానించారు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకు విచారించగా, అసలు విషయాన్ని వెల్లడించారు. దీంతో బైజుతో పాటు చోరీకి అతనికి సహకరించిన మరో ముగ్గురు స్నేహితులను కూడా అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ లో థగ్ లైఫ్ రియల్ రివ్యూ

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments