Webdunia - Bharat's app for daily news and videos

Install App

నివురుగప్పిన నిప్పులా కేరళ.. కొనసాగుతున్న ఉద్రిక్తత

Webdunia
శనివారం, 5 జనవరి 2019 (12:13 IST)
కేరళ రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు నివురుగప్పినా నిప్పులా ఉన్నాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమల ఆలయంలోకి ఇద్దరు మహిళలు ప్రవేశించగా, గురువారం రాత్రి శశికళ అనే శ్రీలంక మహిళ ప్రవేశించింది. దీన్ని ధృవీకరిస్తూ కేరళ పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను రిలీజ్ చేశారు. అసలే అట్టుడుకిపోతున్న కేరళ రాష్ట్రంలో ఈ సీసీటీవీ ఫుటేజీలు మరింత ఆజ్యాన్ని పోసినట్టయింది. 
 
ఫలితంగా రైట్ వింగ్ నిరసనకారులు పలుచోట్ల విధ్వంసం, దాడులకుపాల్పడుతున్నారు. ఆందోళనకారులు పలుచోట్ల విధ్వంసాలకు పాల్పడ్డారు. శుక్రవారం తెల్లవారుజామున కోళికోడ్ జిల్లా పెరంబ్రాలోని మలబార్ దేవస్థానం మండలి సభ్యుడు కె.శశికుమార్ ఇంటిపై నాటుబాంబులు విసిరారు. పథనంథిట్ట జిల్లా అడూర్‌లో మొబైల్ షాప్‌పైనా పేలుడు పదార్థాలను విసిరారు. 
 
రెండు రోజుల్లో జరిగిన హింసకు సంబంధించి 1,108 కేసులు నమోదు కాగా, 1,718 మందిని అరెస్టు చేశారు. ముందు జాగ్రత్త చర్యగా 1,009 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆందోళనకారుల హింసాత్మక దాడుల్లో 132 మంది పోలీసులు, 10 మంది జర్నలిస్టులతోపాటు 174 మందికి గాయాలయ్యాయి. మరోవైపు కేరళలోని పాలక్కాడ్, కసర్‌గోడ్ జిల్లా మంజేశ్వరం తాలుకాల పరిధిలో నిషేధాజ్ఞలు అమలులోకి వచ్చాయి. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments