Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్కకు నైట్ డ్యూటీ.. మరదలిని పిలిపించిన బావ.. చివరికి శవమై..?

Webdunia
శనివారం, 24 జులై 2021 (15:16 IST)
తన బావ పిలవడంతో అతని ఇంటికి వెళ్లిన ఓ యువతి తెల్లారేసరికి శవమై కనిపించింది. ఈ ఘటన కేరళలోని చెర్తాలా కడక్కరపల్లిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హరికృష్ణ(25) ప్రస్తుతం వందనమ్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో తాత్కాలిక నర్సుగా పనిచేస్తోంది. ఆమె అక్క కూడా ఎర్నాకుళంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తుంది. 
 
అయితే శుక్రవారం హరికృష్ణ అక్కకు నైటీ డ్యూటీ ఉండడంతో వెళ్లింది. దాంతో ఆమె భర్త రతీష్.. హరికృష్ణ ఇంటికి వచ్చాడు. తమ పిల్లలను చూసుకోవడానికి తనతో పాటు ఇంటికి రావాల్సిందిగా హరికృష్ణను కోరాడు. ఈ క్రమంలోనే హరికృష్ణ అతనితో కలిసి ఇంటికి వెళ్లింది. 
 
అయితే ఉదయం హరికృష్ణ కనిపించడం లేదనే ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేయగా రతీష్ ఇంట్లో ఆమె మృతదేహం లభించింది. మృతదేహానికి ఫోరెన్సిక్ పరీక్ష నిర్వహించారు. ప్రస్తుతం హరికృష్ణ అక్క, ఆమె భర్త పరారీలో ఉన్నారు. వారి ఫోన్‌లు కూడా స్విచ్చాఫ్‌లో ఉన్నాయి. దాంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments