Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మళ్లీ లాక్డౌన్ దిశగా ఆ రాష్ట్రం... విజృంభిస్తున్న కరోనా వైరస్

మళ్లీ లాక్డౌన్ దిశగా ఆ రాష్ట్రం... విజృంభిస్తున్న కరోనా వైరస్
, గురువారం, 22 జులై 2021 (09:03 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చాలా మేరకు తగ్గినట్టు కనిపించింది. కానీ, మళ్లీ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో లాక్డౌన్ అమలు చేస్తున్నారు. ముఖ్యంగా కేరళ రాష్ట్రంలో పరిస్థితి మరింత దిగజారింది. కొద్ది రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. 
 
కరోనా కేసులు భారీగా నమోదవుతున్న నేపథ్యంలో వారంలో శని, ఆదివారాల్లో రెండు రోజుల పాటు లాక్​డౌన్​ విధించాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 24, 25 తేదీల్లో సంపూర్ణ లాక్​డౌన్​ విధిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. దీనికి కూడా జూన్​ 12,13 తేదీల్లో విధించిన లాక్​డౌన్​ మార్గదర్శకాలే వర్తిస్తాయని తెలిపింది. ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది. 
 
బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు సైతం మూసివేయనున్నట్లు తెలిపింది. వివిధ ప్రాంతాల్లో నమోదవుతున్న పాజిటివిటీ రేటు ఆధారంగా ఆంక్షలు కొనసాగుతాయని వెల్లడించింది. అలాగే, ఈ నెల 23 తేదీన రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల కొవిడ్​ నమూనాలను పరీక్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది. పాజిటివిటీ రేటు 10 శాతం కంటే ఎక్కువగా నమోదవుతున్న జిల్లాలపై ప్రధానంగా దృష్టి సారించాలని కేరళ సర్కార్ నిర్ణయించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

1 నుంచి ఎస్వీయూ పీజీ ఫస్ట్‌ సెమిస్టర్‌