Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా ఇన్ఫెక్షన్‌.. మహిళపై ఓ వ్యక్తి అసభ్య ప్రవర్తన..

Webdunia
శనివారం, 15 మే 2021 (18:00 IST)
కరోనా తీవ్ర ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న మహిళపై ఓ వ్యక్తి అసభ్యంగా వ్యవహరించిన ఘటన కేరళలోని మలప్పురం జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది.

woman
ఎంఆర్ఐ సెంటర్‌కు రోగిని తరలిస్తుండగా బాధితురాలిపై అంబులెన్స్ అటెండెంట్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఏప్రిల్ 27న ఈ ఘటన జరగ్గా మహిళ ఆరోగ్యం మెరుగుపడిన అనంతరం గురువారం (మే 13) వైద్యులకు ఈ విషయం వెల్లడించారు.
 
వైద్యులు పోలీసులకు సమాచారం అందించడంతో నిందితుడు ప్రశాంత్ (33)ను అరెస్ట్ చేశారు. పెరింతలమన పట్టణంలో బాధిత మహిళ ఇటీవల ప్రైవేట్ దవాఖానలో కరోనా చికిత్స నిమిత్తం చేరారు. ఆమె పరిస్థితి విషమం కావడంతో ఏప్రిల్ 27న అంబులెన్స్‌లో ఎంఆర్ఐ స్కానింగ్ కోసం ల్యాబ్‌కు తరలించారు.
 
ఈ క్రమంలో అంబులెన్స్ వాహనంలో అటెండెంట్ ప్రశాంత్ ఆమె పట్ల అసభ్యంగా వ్యవహరించాడు. ఆరోగ్యం విషమంగా ఉండటంతో ఈ విషయం ఆమె వెల్లడించలేదు. ప్రశాంత్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం