పెళ్లికి వచ్చిన 43 మందికి కరోనా పాజిటివ్... వధువు తండ్రిపై కేసు.. ఎక్కడ?

Webdunia
మంగళవారం, 28 జులై 2020 (07:32 IST)
దేశంలో కరోనా వైరస్ కోరలు చాస్తోంది. ఈ వైరస్ శరవేగంగా వ్యాపిస్తుండటంతో ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శ్రద్ధ తీసుకుని జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నారు. ప్రభుత్వం సూచిస్తున్న మార్గదర్శకాలు పాటించాలని చెబుతున్న కొందరు పట్టించుకోవడం లేదు. వీలైనంత తక్కువ మందితో శుభకార్యాలు చేసుకోవచ్చని సడలింపులు ఇవ్వడంతో కార్యక్రమాలు ఎక్కువ జరుగుతున్నాయి. 
 
కానీ, చాలా మంది అజాగ్రత్తగా ఉంటూ కరోనా వైరస్ వ్యాప్తికి తమవంతు సాయం చేస్తున్నారు. తాజాగా, తన కుమార్తె పెళ్లిని ఘనంగా చేసి 43 మందికి వైరస్ సోకడానికి కారణమయ్యాడో తండ్రి. దీంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన జూలై 17వ తేదీన కేరళలోని కాసర్‌గఢ్ జిల్లాలో జరిగింది. కొవిడ్-19 నిబంధనలను ఉల్లంఘించి నిర్వహించిన ఈ పెళ్లి వేడుకకు హాజరైన వారిలో ఏకంగా 43 మంది కొవిడ్ బారినపడ్డారు.
 
నిబంధనలకు విరుద్ధంగా పెద్ద ఎత్తున వేడుకకు హాజరు కావడంతో స్పందించిన అధికారులు అందరికీ పరీక్షలు నిర్వహించగా అందులో వధూవరులు సహా మొత్తం 43 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో వైద్యాధికారులు అందరినీ క్వారంటైన్‌కు తరలించారు. ఇక, నిబంధనలు ఉల్లంఘించి పెళ్లి చేసిన వధువు కేరళ పోలీసులు... కేరళ ఎపిడెమిక్ డిసీజెస్ ఆర్డినెన్స్ 2020 కింద వధువు తండ్రిపై బడియుడుక్కా కేసు నమోదు చేశారు. కేరళలో ఆదివారం 927 కొవిడ్ -19 పాజిటివ్‌ కేసులు, రెండు మరణాలు నమోదయ్యాయి. రాష్ట్రంలో 9,655 క్రియాశీల కేసులున్నాయి.
 
ఆ తర్వాత వివాహ కార్యక్రమానికి హాజరై వ్యక్తులను నిర్బంధంలో ఉండాలని లక్షణాలుంటే, సమీప ఆరోగ్య కేంద్రాన్ని సంపద్రించాలని జిల్లా కలెక్టర్‌ సూచించారు. ఇందులో సుమారు 43 మందికి వైరస్‌ పాజిటివ్‌గా పరీక్షించారు. దీనిపై కాసర్గోడ్ జిల్లా అథారిటీ కేసు నమోదు చేసింది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments