Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైట్‌హౌస్‌లో కరోనా కలకలం : డోనాల్డ్ ట్రంప్‌కు వైరస్ భయం!!

Webdunia
మంగళవారం, 28 జులై 2020 (07:23 IST)
అమెరికా అధ్యక్ష పరిపాలనా కేంద్రమైన వైట్‌హౌస్‌లోకి కరోనా వైరస్ ఎంటరైంది. ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్న రాబర్ట్ ఓబ్రియాన్‌కు కరోనా వైరస్ సోకింది. ఆయనకు నిర్వహించిన వైద్యపరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ మేరకు వైట్‌హౌస్ కూడా అధికారికంగా ఓ ప్రకటన చేసింది.
 
ఓబ్రియన్ కు కరోనా నిర్ధారణ అయిందని, ఆయన ప్రస్తుతం ఐసోలేషన్ లోకి వెళ్లారని తెలిపింది. క్వారంటైన్‌లో ఉంటూ విధులు నిర్వర్తిస్తారని వెల్లడించింది. జాతీయ భద్రతా మండలి కార్యకలాపాలకు ఎలాంటి ఆటంకం ఉండదని స్పష్టం చేశాయి.
 
అమెరికా పాలన వ్యవహారాల్లోనూ, విదేశాంగ విధానంలోనూ కీలక పాత్ర పోషించే రాబర్ట్ ఓబ్రియన్ ఈ నెలలో పారిస్ వెళ్లి ఓ సమావేశంలో పాల్గొన్నారు. అయితే ఆయనకు ఎక్కడ కరోనా సోకిందన్న దానిపై స్పష్టతలేదు. 
 
జాతీయ భద్రతా సలహదారుకు కరోనా నిర్ధారణ అయిన నేపథ్యంలో, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు, ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్‌కు కరోనా ముప్పు లేదని వైట్‌హౌస్ స్పష్టం చేసింది.
 
కాగా, గతంలో కరోనా రాకుండా ముఖానికి మాస్కులు ధరించాలని వైద్య నిపుణులు పదేపదే సూచించారు. కానీ, డోనాల్డ్ ట్రంప్ తేలిగ్గా తీసుకున్నారు. కానీ, ఇటీవల ఆయన మాట్లాడుతూ, ముఖానికి మాస్క్ ధరించడం దేశ భక్తిని చాటడమే అంటూ వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments