Webdunia - Bharat's app for daily news and videos

Install App

హెరిటేజ్ ప్లాంట్‌లో కలకలం... ఢిల్లీలో ముగ్గురు విలేకరులకు పాజిటివ్

Webdunia
బుధవారం, 29 ఏప్రియల్ 2020 (13:41 IST)
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ పారిశ్రామికవాడలో ఉన్న హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ ప్లాంట్లో కలకలం చెలరేగింది. ఇక్కడ పని చేస్తున్న 34 మంది సిబ్బందిని జీహెచ్ఎంసీ అధికారులు క్వారంటైన్‌కు తరలించారు. ఈ ప్లాంట్‌లో పని చేస్తున్న సెక్యూరిటీ గార్డుల్లో ఒకరికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఇక్కడ పనిచేసేవారందరినీ క్వారంటైన్‌కు అధికారులు తరలించారు. 
 
ఈ ప్లాంట్‌లో పని చేస్తున్న ఓ సెక్యూరిటీ గార్డుకు అతని తండ్రి నుంచి కరోనా వైరస్‌ సోకింది. అయితే, ఈ విషయాన్ని బయటకు పొక్కకుండా నిర్వాహకులు గోప్యత పాటించారు. అతనితో కాంటక్ట్‌ అయిన 33 మందిని గుర్తించి రహస్యంగా ఓ చిన్న ఇంట్లో ఉంచారు.  దీనిపై  స్థానికులు ఫిర్యాదు చేయడంతో జీహెచ్‌ఎంసీ అధికారులు ప్లాంట్‌ దగ్గరకు వచ్చారు. మొత్తం 34 మంది అనుమానితులను క్వారంటైన్‌కు పంపించారు.
 
మరోవైపు, దేశంలోని పలు రాష్ట్రాల్లో విలేకరులు కరోనా వైరస్ బారినపడుతున్నారు. ముంబై, చెన్నైలలో అనేక మంది జర్నలిస్టులు ఈ వైరస్ బారినపడ్డారు. అలాగే, ఢిల్లీలోకూడా ఉన్నారు. ఇదే విషయంపై ఆ రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందిస్తూ, ఢిల్లీలో 529 మంది మీడియా ప్రతినిధులకు పరీక్షలు చేయగా.. కేవలం ముగ్గురికి మాత్రమే పాజిటివ్‌ అని తేలిందని చెప్పారు. 
 
జర్నలిస్టులందరూ క్షేమంగా ఉండాలని ఆయన కోరుకున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల పాత్రికేయుల పని చాలా ముఖ్యమైనదని అన్నారు. కరోనా సోకిన జర్నలిస్టులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని కేజ్రీవాల్ చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mokshagna: 30వ ఏట మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ.. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ రెడీ

విజయ్ ఆంటోనీ భద్రకాళి నుంచి లవ్ సాంగ్ మారెనా రిలీజ్

Anupama Parameswaran: ఆ సమస్యకి నా దగ్గర ఆన్సర్ లేదు : అనుపమ పరమేశ్వరన్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర రిలీజ్ లో పెద్ద ట్విస్ట్

Gemini Suresh : జెమిని సురేష్ ముఖ్యపాత్రలో ఆత్మ కథ చిత్ర ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments