Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 23 April 2025
webdunia

ఢిల్లీలో లాక్‌డౌన్ సడలింపులు ఉండవ్ : సీఎం అరవింద్ కేజ్రీవాల్

Advertiesment
Coronavirus
, ఆదివారం, 19 ఏప్రియల్ 2020 (15:31 IST)
కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతోంది. ఇది మే నెల 3వ తేదీ వరకు అమల్లోవుండనుంది. అయితే, ఈ నెల 20వ తేదీ తర్వాత ఆంక్షలు సడలించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 
 
ఇదే అంశంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం స్పందిస్తూ, కరోనా వైరస్‌ వ్యాప్తి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఎలాంటి మినహాయింపులు లేకుండానే లాక్‌డౌన్‌ కొనసాగించాలని నిర్ణయించింది. 
 
కేంద్ర ప్రభుత్వ మార్గనిర్దేశకాల ప్రకారం ఏప్రిల్ 20వ తేదీ నుంచి లాక్‌డౌన్‌ నిబంధనలను మార్చుకునే వెసులుబాటు ఉంది. అయితే లాక్‌డౌన్‌ సడలిపులపై సీఎం కేజ్రీవాల్‌ ఆదివారం మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. 
 
ఈ క్రమంలో ఢిల్లీలో కరోనా తీవ్రంగా ఉండటంతో సడలింపు ఇవ్వకూడదని కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి ఎలాంటి మినహాయింపులు లేవని కేజ్రీవాల్‌ అధికారికంగా ప్రకటించారు. కరోనా తీవ్రత, లాక్‌డౌన్‌ సడలింపుపై ఏప్రిల్‌ 27న మరోసారి సమీక్ష నిర్వహించి అప్పటి పరిస్థితుల ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని సీఎం తెలిపారు. 
 
క‌రోనా వైరస్ ప్రభావం ఢిల్లీలో అధికంగానే ఉంది. పాజిటివ్‌ కేసుల్లో దేశవ్యాప్తంగా రెండో స్థానంలో ఉంది. దేశ రాజధానిలో 71 కంటైన్మెంట్ జోన్ల‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు 1,893 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 42 మంది మరణించారు. 
 
ఈ క్రమంలో లాక్‌డౌన్‌ మినహాయింపులు ఇస్తే మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉందని కేజ్రీవాల్‌ ప్రభుత్వం భావిస్తోంది. ఈ లాక్‌డౌన్‌ సమయంలో బయటకు రావద్దని సీఎం కేజ్రీవాల్‌ ప్రజలకు విజ్ఞప్తిచేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆంధ్రాలో కొత్తగా మరో 44 కరోనా కేసులు