Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభం... ఏపీ బాధ్యతలు ఆయనకు..

Webdunia
బుధవారం, 14 డిశెంబరు 2022 (14:15 IST)
ఢిల్లీలో భారత్ రాష్ట్ర సమితి ప్రధాన కార్యాలయాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ప్రారంభించారు. ఆ తర్వాత ఆయన కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బీఆర్ఎస్ ఏపీ బాధ్యతలను తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు అప్పగించారు. ఆయనకు ఏపీకి రాజకీయ నేతలతో మంచి సంబంధాలు ఉన్నాయి. 
 
దీంతో ఆయనకు కీలక బాధ్యతలను అప్పగించారు. ఇందులోభాగంగా, ఇప్పటికే ఆయన హైదరాబాద్ నగరంలో ఉన్న ఏపీకి చెందిన రాజకీయ ప్రముఖులతో సంప్రదింపులు కూడా మొదలుపెట్టారు. తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే రాష్ట్రాల్లో పోటీ చేయాలన్న ఆలోచనలో బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఉన్నారు. 
 
ఇందులోభాగంగా, ఏపీ నడిబొడ్డున భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. పైగా, ఈ బహిరంగ సభ బాధ్యతలను కూడా ఆయన తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు అప్పగించారు. జాతీయ పార్టీ అధికారిక గుర్తింపు కోసం తెలుగు ప్రజలు అత్యధికంగా ఉండే రాష్ట్రాల్లో పోటీ చేయాలని సీఎం కేసీఆర్ ఉన్నారు. ఇందులోభాగంగా, తొలి దశలో ఏపీ, కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్ర వంటి ప్రాంతాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను బరిలోకి దించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

హారర్ థ్రిల్లర్ కథతో తెరకెక్కుతున్న నిశ్శబ్ద సినిమా టీజర్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments