కాశీలోని ప్రతి రాయి శివుడే... ప్రధాని నరేంద్ర మోడీ

Webdunia
సోమవారం, 13 డిశెంబరు 2021 (20:40 IST)
పవిత్ర పుణ్యస్థలం కాశీలో ప్రతి రాయిలోనూ శివుడు కొలువైవున్నాడని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కొత్తగా నిర్మించిన కాశీ విశ్వనాథ్ కారిడార్‌ను ఆయన సోమవారం ప్రారంభించారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాశీ భారత సంస్కృతిక రాజధాని అని అన్నారు. ఇక్కడ ప్రతి రాయి ఓ పరమాత్మ స్వరూపుడైన శివుడే. కాశీకి సేవ చేయడం అనంతం అని చెప్పుకొచ్చారు. దేశ ప్రజలందరికీ రాశీ విశ్వనాథుని ఆశీస్సులు ఉండాలన్నారు. 
 
మన దేశంలో భక్తికి కొదవలేదన్నారు. ఆ భక్తిని ఢీకొనే శక్తి దేనికీ లేదన్నారు. అంతేకాకుండా, భారత్ సనాతన సంప్రదాయాలకు ప్రతీక వారణాసి అని అన్నారు. నేటి భారత్ గతంలో కోల్పోయిన వైభవాన్ని అందుకుంటోందన్నారు. చోరీకి గురైన అన్నపూర్ణ విగ్రహం మళ్ళీ వందేళ్ళ తర్వాత భారత్‌కు వచ్చిందన్నారు. 
 
అంతేకాకుండా, ఆయన దేశ ప్రజలకు ఓ మరో పిలుపునిచ్చారు. దేశం కోసం దేశ ప్రజలంతా మూడు సంకల్పాలను తీసుకోవాలన్నారు. స్వచ్ఛత, సృజన్, ఆత్మ నిర్భర్ భారత్ కోసం నిరంతరం ప్రయత్నం చేయాలని ప్రధాని మోడీ కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venu Swamy: రామ్ చరణ్- ఉపాసనల ట్విన్ బేబీస్.. వేణు స్వామి జ్యోతిష్యం తప్పిందిగా?

Upasana: రామ్ చరణ్, ఉపాసనకు ట్విన్ బేబీస్ రానున్నారా? (video)

Rebel Star Prabhas: ఫ్యాన్స్ లేకపోతే నేను జీరో అంటున్న రెబల్ స్టార్ ప్రభాస్

Chiranjeevi.: సూపర్ స్టార్ చిరంజీవి.. విశ్వంభర.. ఎప్పుడొస్తుందో తెలుసా..

Chandini Chowdhury : యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా చాందినీ చౌదరి... సంతాన ప్రాప్తిరస్తు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments