Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైతులు మహా పాదయాత్ర: ఒకవైపు హెచ్చరికలు మరోవైపు స్వాగతం

Webdunia
సోమవారం, 13 డిశెంబరు 2021 (20:34 IST)
అమరావతి రైతులు పాదయాత్ర చేపట్టి 43 రోజులవుతోంది. ఇక మిగిలింది రెండురోజులు మాత్రమే. న్యాయస్థానం టు దేవస్థానం అంటూ పాదయాత్రను ప్రారంభించి నిరంతరాయంగా నడుస్తూనే ఉన్నారు. అయితే తిరుపతిలో పాదయాత్రను అడుగుపెట్టనీయము.. అడ్డుకుంటామంటూ రకరకాల హెచ్చరికలు జారీ చేశారు.

 
అయితే ఎలాంటి హడావిడి లేకుండా పాదయాత్ర తిరుపతికి చేరుకుంది. ప్రస్తుతం రామానాయుడు కళ్యాణ మండపం వద్ద అమరావతి రైతులు సేద తీరుతున్నారు. అయితే అమరావతి రైతులను హెచ్చరిస్తూ.. వారికి స్వాగతం పలుకుతూ కొన్ని ఫ్లెక్సీలు వెలిశాయి.

 
మీతో మాకు గొడవలు వద్దు.. మాకు మూడు రాజధానులు కావాలంటూ.. మీకు తిరుపతికి స్వాగతమంటూ అమరావతి రైతులను ఒకవైపు హెచ్చరిస్తూ.. మరోవైపు స్వాగతం పలుకుతూ నగరంలో ఫ్లెక్సీలు వెలిశాయి. 

 
నగరంలోని చాలా ప్రాంతాల్లో ఇదేవిధంగా వైసిపి నేతలు ఫ్లెక్సీలను ఏర్పాటు చేసేశారు. దీన్ని చూసిన జనం ఆశ్చర్యపోతున్నారు. ఎవరో ఫ్లెక్సీని ఏర్పాటు చేసి తిరుపతి ప్రజలు అంటూ రాయడంపై ఆశ్చర్యానికి లోనవుతున్నారు. 
 
ఇదంతా అధికార పార్టీ నేతల పనేనంటూ అమరావతి రైతులు చెబుతున్నారు. హెచ్చరికలు జారీ చేస్తూ ఫ్లెక్సీలు ఎలా ఏర్పాటు చేస్తారంటూ ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కళ్యాణి ప్రియదర్శన్‌ ను కొత్తగా ఆవిష్కరించిన కోత లోకహ్ 1: చంద్ర ట్రైలర్

Sreeleela: జూనియర్ ఎన్టీఆర్‌ను చూసి ముచ్చటపడిన శ్రీలీల తల్లి స్వర్ణలత

Amani: ఒగ్గు కళాకారుల నేపథ్యం లో తెరకెక్కిన బ్రహ్మాండ చిత్రం

బార్బరిక్ షూటింగ్‌లో ప్రతీ రోజూ ఛాలెంజింగ్‌గా అనిపించేది : వశిష్ట ఎన్ సింహా

హర హర శంకర పాటలో సమాజంలో ఘోరాల్ని చూపించారు : తనికెళ్ళ భరణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments