Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.50వేల అప్పు.. తిరిగి చెల్లించలేదు.. మహిళను స్తంభానికి కట్టేసి? (video)

Webdunia
శుక్రవారం, 14 జూన్ 2019 (14:31 IST)
అప్పును తిరిగి చెల్లించలేని మహిళపై దారుణం జరిగింది. రుణాన్ని తిరిగివ్వలేని మహిళను కరెంట్ స్తంభానికి కట్టివేసి దాడి చేశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ అమానుష చర్యపై సోషల్ మీడియాలో నెటిజన్లు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. కర్ణాటక, సామ్‌రాజ్ నగర్ జిల్లా, కొడిహెల్లికి చెందిన రాజామణికి 36 ఏళ్లు. 
 
ఈమె ఆ గ్రామంలో చిన్న హోటల్ నిర్వహిస్తోంది. అంతేగాకుండా చిట్ ఫండ్ బిజినెస్ కూడా చేస్తోంది. ఈ నేపథ్యంలో రూ.50వేల వరకు రాజామణి అప్పు తీసుకుంది. ఇంకా తీసుకున్న రుణాన్ని తిరిగి ఇవ్వలేకపోయింది. అయితే రాజామణికి రుణంగా డబ్బులిచ్చిన వారు ఆమెపై దాడికి పాల్పడ్డారు. ఆమెను కరెంట్ స్తంభానికి కట్టివేసి చిత్ర హింసలకు గురిచేశారు. 
 
వీడియోలో ఆమెను చెప్పులతో, చీపురుతో దాన్ని కొట్టండి అంటూ తీవ్రంగా దూషించడం, హింసించడం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై రచ్చ మొదలు కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. 
 
ముందుగా రాజామణిని విద్యుత్ స్తంభంలో కట్టేసిన ఏడుగురిని అరెస్ట్ చేశారు. ఇంకా వడ్డీకి డబ్బులిచ్చి.. బాధిత మహిళను తీవ్రంగా హింసించిన వారిపై తగిన చర్యలు తీసుకోనున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments