కర్నాటకలో హిజాబ్ వివాదం - 58 మంది విద్యార్థుల సస్పెండ్!

Webdunia
ఆదివారం, 20 ఫిబ్రవరి 2022 (09:22 IST)
కర్నాటక రాష్ట్రంలో చెలరేగిన హిజాబ్ వివాదం కొనసాగుతోంది. శివమొగ్గ జిల్లా శిరాల్కొప్పలో హిజాబ్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేసిన 58 మంది విద్యార్థినులను ప్రిన్సిపాల్ సస్పెండ్ చేయడం కలకలం రేగింది. ఇది పెద్ద వివాదానికి దారితీసేలా కనిపించడంతో ఆ రాష్ట్ర మంత్రి నారాయణ గౌడ వివరణ ఇచ్చారు. విద్యార్థినులను సస్పండ్ చేయలేదని కేవలం హెచ్చరించారని తెలిపారు. ఇదే విషయాన్ని ప్రిన్సిపాల్ కూడా తెలిపారు. 
 
అదేసమయంలో హిజాబ్ దుస్తుల్లో కాలేజీలకు వస్తే రూ.200 అపరాధం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరిస్తూ హాసన్‌లో నోటీసులు అంటించారు. మరోవైపు, అన్ని మతాల పెద్దలు శనివారం అత్యవసరంగా సమావేశమై ఈ వివాదంపై చర్చించారు. ఆ తర్వాత వారు మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో మతసామరస్యాన్ని కొనసాగించాలని వారు ప్రజలకు పిలుపునిచ్చారు. 
 
అదేసమయంలో సనాతన ఆలోచనల నుంచి మైనారిటీలు బయటకు రావాలని ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ ముస్లిం రాష్ట్రీయ మంచ్ హితవు పలికింది. హిజాబ్ కంటే విద్యే ముఖ్యమని మంచ్ జాతీయ కన్వీనర్ షాహిద్ సయీద్ అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments