Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉడిపి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. సాఫ్ట్‌వేర్ దంపతుల మృత్యువాత

Webdunia
ఆదివారం, 11 డిశెంబరు 2022 (12:16 IST)
కర్నాటక రాష్ట్రంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో అనంతపురం జిల్లాకు చెందిన సాఫ్ట్‌వేర్ దంపతులు మృత్యువాతపడ్డారు. శనివారం జరిగిన ఈ ప్రమాదంలో జిల్లాలోని ఉరవకొండ, చిన్న ముుష్టూరుకు చెందిన దంపతులు, వారి కుమార్తె చనిపోయారు. ఈ వివరాలను పరిశీలిస్తే,
 
చిన్న ముష్టూరుకు చెందిన రిటైర్డ్ ఉద్యోగి శ్రీరాములు అనే వ్యక్తి కుమారుడు శ్రీకాంత్ (41), కోడలు ప్రతీక్ష (35)లు బెంగుళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. వీరికి గమ్య (4) అనే కుమార్తె, దైవిక (2) అనే కుమారుడు ఉన్నాడు. 
 
కుమారుడిని అనంతపురంలో ఉంటున్న అమ్మమ్మ వద్ద విదిలిపెట్టిన దంపతులు.. శుక్రవారం రాత్రి కుమార్తెతో కలిసి బెగుళూరుకు కారులో బయలుదేరి, మధ్యలో ధర్మస్థలం మంజునాథ స్వామి ఆలయానికి వెళ్లారు. అక్కడ శనివారం స్వామివారి దర్శనం పూర్తి చేసుకుని కారులోనే శృంగేరికి బయలుదేరారు. 
 
ఈ క్రమంలో వారు ప్రయాణిస్తున్న కారు ఉడిపి జదిల్లా కార్కల ఠాణా పరిధిలో ఓ ప్రైవేటు బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న శ్రీకాంత్, ప్రతీక్షతో పాటు వారి కుమార్తె గమ్య కూడా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ విషయం తెలిసిన శ్రీకాంత్ తల్లిదండ్రులు, అత్తమామలు బోరున విలపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments