Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేతిలో బిడ్డతో వెళ్తున్న మహిళ.. వెనుక నుంచి ఎక్కిదిగిన జీపు?

Webdunia
సోమవారం, 11 ఫిబ్రవరి 2019 (18:32 IST)
కర్ణాటక రాష్ట్రంలో ఘోరం జరిగింది. కర్ణాటక, పుత్తూరు తాలూకాలోని, సంతలో ఓ మహిళ చేతిలో బిడ్డతో నడిచి వెళ్తుండగా వెనుకనుంచి వచ్చిన జీపు.. తల్లీబిడ్డలపై ఎక్కి దిగింది. వెంటనే ఆ సంతలోని ప్రజలు హుటాహుటిన మహిళను, బిడ్డను కాపాడారు. ఈ ఘటనలో చిన్నపాటి గాయాలతో తల్లీబిడ్డ తప్పించుకున్నారు. 
 
ఈ ఘటనపై పోలీసులు జీపు డ్రైవర్ వద్ద జరిపిన విచారణలో.. జీపును తాళంతో అలానే నిలబెట్టి.. పక్క షాపుకు వెళ్లాడని.. ఆ సమయంలో అక్కడ ఆడుకుంటున్న చిన్నారులు.. జీపు తాళాన్ని మెల్లగా తిప్పేశారు. దీంతో వేగంతో ముందుకు నడిచిన జీపు.. సమీపంలో చేతిలో బిడ్డతో సహా నడిచి వెళ్తున్న మహిళపై ఎక్కి దిగింది. ఆపై ఓ గోడకు ఢీకొని ఆగిపోయింది. 
 
ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. చేతిలో బిడ్డతో నడుస్తూ వెళ్తున్న మహిళను వెనకు నుంచి వచ్చిన జీపు ఎక్కి దిగడానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన వారంతా షాకవుతున్నారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments