Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుమస్తా ఉద్యోగి నెల వేతనం రూ.15 వేలు.. ఆస్తులు రూ.30 కోట్లు

ఠాగూర్
శుక్రవారం, 1 ఆగస్టు 2025 (12:56 IST)
కర్నాటక రాష్ట్రంలో ఓ ప్రభుత్వ మాజీ ఉద్యోగి బండారం బయటపడింది. నెలకు రూ.15 వేలు వేతనం తీసుకునే ఆ ఉద్యోగి ఆస్తులు మాత్రం రూ.30 కోట్లుగా ఉన్నాయి. ఈ విషయం లోకాయుక్త అధికారులు జరిపిన ఆకస్మిక తనిఖీల్లో వెలుగు చూశాయి. ఇంతకీ ఆ ఉద్యోగి చేసేది గుమస్తా ఉద్యోగం. అతనిపై అవినీతి ఆరోపణలు రావడంతో లోకాయుక్త అధికారులు సోదాలు జరిపిపారు. అప్పట్లో ఆయన జీతం నెలకు రూ.15వేలు కాగా.. ఆస్తులు మాత్రం రూ.30 కోట్లు ఉన్నాయి. ప్రస్తుతం ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.
 
కర్నాటక రాష్ట్రంలోని కొప్పల్‌ జిల్లాలోని కర్ణాటక గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి లిమిటెడ్‌‌లో కలకప్ప నిడగుండి అనే వ్యక్తి గుమస్తాగా చేసి రిటైరయ్యారు. నెలకు రూ.15 వేలు జీతానికి పనిచేశారు. అందులోనే మాజీ ఇంజినీర్‌గా ఉన్న జెడ్ఎం.చిన్చోల్కర్‌తో కలిసి నిడగుండి పలు అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. 
 
పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు నకిలీ పత్రాలు, నకిలీ బిల్లులు సృష్టించడంతో పాటు దాదాపు రూ.72 కోట్లకు పైగా దుర్వినియోగం చేశారనేది ప్రధాన ఆరోపణ. దీనిపై లోకాయుక్తకు ఫిర్యాదు అందడంతో కోర్టు ఆదేశాలమేరకు నిడగుండి ఇంట్లో అధికారులు సోదాలు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika Ganesh: నటి కల్పిక మానసిక ఆరోగ్యం క్షీణిస్తోంది.. మందులు వాడట్లేదు: తండ్రి గణేష్ ఫిర్యాదు (video)

OG: పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా నుంచి ఫస్ట్ బ్లాస్ట్ ఇవ్వబోతున్న థమన్

ఊర్వశి రౌతేలాకు షాక్.. లండన్‌లో బ్యాగు చోరీ

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తర్వాతి కథనం
Show comments