Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ్యాక్సిన్ వేయించుకున్నా.. కరోనా వైరస్ సోకింది... ఎక్కడ?

Webdunia
సోమవారం, 1 ఫిబ్రవరి 2021 (11:06 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు పలు ఫార్మా కంపెనీలు కరోనా టీకాలను అభివృద్ధి చేయగా, వీటిని ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వినియోగిస్తున్నారు. అలాగే, మన దేశంలో కూడా ఈ టీకాలను వేశారు. అయితే, ఈ వ్యాక్సిన్ వేయించుకున్న ఐదుగురికి ఈ వైరస్ సోకింది. ఈ ఐదుగురు కూడా వైద్యులే కావడం గమనార్హం. ఈ ఘటన కర్నాటక రాష్ట్రంలోని చామరాజనగర్ జిల్లాలో జరిగింది. 
 
కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా చామరాజనగర్ జిల్లాలో కరోనా టీకాను తీసుకున్న ఐదుగురు డాక్టర్లు మహమ్మారి బారినపడ్డారు. ఈ విషయం స్థానికంగా కలకలం రేపింది. వీరికి తొలి డోస్‌ను తీసుకున్న వారం వ్యవధిలోనే కరోనా సోకింది. దీంతో వ్యాక్సిన్ పనితీరుపై వైద్య సిబ్బంది అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. 
 
అయితే, వ్యాక్సిన్ తీసుకున్న వారం వ్యవధిలో కరోనా సోకినంత మాత్రాన టీకా పనితీరు బాగాలేదని భావించనక్కర్లేదని వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. టీకా తీసుకున్న తర్వాత దాదాపు 40 రోజులకు శరీరంలో యాంటీ బాడీలు వృద్ధి చెందుతాయని అంటున్నారు.
 
కాగా, తొలి డోస్ తీసుకున్న 28 రోజుల తర్వాత రెండో డోస్‌ టీకా వేయించుకోవాల్సి వుంది. రెండో డోస్ తీసుకున్న పది రోజులకు శరీరంలో యాంటీ బాడీలు పెరుగుతాయని, అప్పుడే కరోనా వైరస్‌ను ఎదుర్కొనే శక్తి శరీరానికి వస్తుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. 
 
టీకా తొలి డోస్ తీసుకున్న వారు కూడా అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలని, మాస్క్‌లు ధరించడం, చేతులను శుభ్రం చేసుకుంటూ, బహిరంగ ప్రదేశాల్లో భౌతిక దూరం పాటించడం తప్పనిసరని వైద్య నిపుణులు సూచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

Varma: ఏపీలో శారీ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు - రామ్ గోపాల్ వర్మ

జాక్ - కొంచెం క్రాక్ గా వుంటాడు, నవ్విస్తాడు : సిద్ధు జొన్నలగడ్డ

లైసెన్స్ ఉన్న బెట్టింగ్ యాప్‌‍లకే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారట...

వాళ్లు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌ టుక్‌టుక్‌ చిత్రం విజయంపై నమ్మకం పెరిగింది : నిర్మాత రాహుల్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments