Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ దళిత ఎంపీకి అవమానం : దైవ దర్శనాన్ని అడ్డుకున్న యాదవులు

Webdunia
మంగళవారం, 17 సెప్టెంబరు 2019 (15:09 IST)
కర్నాటక రాష్ట్రంలో అధికార బీజేపీ ఎంపీకి ఘోర అవమానం జరిగింది. ఆయన దళితుడు కావడమే ఈ అవమానానికి ప్రధాన కారణం. ఈ దళిత ఎంపీ తమ ప్రాంతంలో అడుగుపెట్టడానికి వీల్లేదంటూ ఆ యాదవులంతా ముక్తకంఠంతో కోరారు. దీంతో ఆ బీజేపీ దళిత ఎంపీ మిన్నకుండిపోయారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, కర్నాటక రాష్ట్రానికి ఏ.నారాయణస్వామి బీజేపీ ఎంపీగా ఉన్నారు. ఈయన దళిత సామాజిక వర్గానికి చెందిన నేత. నియోజకవర్గ పర్యటనలో భాగంగా ఆయన తుమకూరులోని యాదవుల గుడిలోకి వెళ్లి దర్శనం చేసుకుందామనుకున్నారు. కానీ అతడిని ఆ కులస్తులు గుళ్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. 
 
ఈ సంఘటనపై నాగరాజు అనే వ్యక్తి స్పందిస్తూ, మేమంతా చాలా సాంప్రదాయవాదులం. మా గుడికి ఎంతో ప్రత్యేకత ఉంది. అణగారిన వర్గానికి చెందిన వ్యక్తి గుడిలో అడుగు పెడితే కీడు జరుగుతుందని కుల పెద్దలు చెప్పడంతో అతడిని గుళ్లోకి రానివ్వలేమని అన్నారు.
 
ఈ సంఘటనపై ఎంపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కాగా, భారతదేశం కుల, మతాల సమ్మేళనం, భిన్నత్వంలో ఏకత్వం అనేవి ఉట్టి మాటలేనని మరోసారి రుజువైంది. పార్లమెంట్‌ మెంబర్‌కే ఇలాంటి అవమానం జరిగినపుడు గ్రామాల్లో సాధారణ ప్రజల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి పరిస్థితి దేశంలో ఇకనైనా మారాలని ఆశిద్దాం అంటూ వ్యాఖ్యానించారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments